Kishan Reddy: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కుంభకోణాలే: కిషన్‌ రెడ్డి

దేశంలో స్థిరమైన పాలన కోసం భాజపాను గెలిపించాలని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Published : 11 Apr 2024 15:11 IST

హైదరాబాద్‌: దేశంలో స్థిరమైన పాలన కోసం భాజపాను గెలిపించాలని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఆయన జీప్ యాత్ర నిర్వహించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మతకలహాలు, అవినీతి కుంభకోణాలేనని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వస్తే.. దేశంలో మళ్లీ కుటుంబ పాలన వస్తుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని