Kishan Reddy: మరోసారి మోదీ ప్రధాని కాకుండా ఎవరూ ఆపలేరు: కిషన్రెడ్డి
ప్రజల దృష్టిని మళ్లించేందుకే భారాస, కాంగ్రెస్ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తున్నాయని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు.
మక్తల్: ప్రజల దృష్టిని మళ్లించేందుకే భారాస, కాంగ్రెస్ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తున్నాయని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు భారాస ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఛార్జిషీట్ ప్రకటించిందని.. వాటి ఆధారంగా కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. మక్తల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘కాంగ్రెస్, భారాస.. రెండూ కుటుంబ పార్టీలే. ఈ ఎన్నికల్లో పోటీకి భారాసకు ఎలాంటి అజెండా లేదు. ఆ పార్టీకి ఒక్క సీటూ రాకపోయినా జనానికి వచ్చే నష్టం లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదు. ఆ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ప్రదేశ్లోని అన్ని ఎంపీ సీట్లు, కర్ణాటకలో 25 సీట్లు భాజపా గెలవబోతోంది. తెలంగాణలో కాంగ్రెస్ 3-4 సీట్లు గెలిచినా రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు. మోదీ మరోసారి ప్రధాని కాకుండా ఎవరూ ఆపలేరు. తెలంగాణలో భాజపా అత్యధిక సీట్లు గెలవకుండా ఏ శక్తీ అడ్డుకోలేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది. ఆ పార్టీ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. సోనియా కుటుంబానికి సేవ తప్ప.. హామీల అమలుపై వారికి దృష్టి లేదు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఎప్పుడు అమలులోకి తీసుకొస్తారో కాంగ్రెస్ నేతలు చెప్పాలి. ఎన్ని లక్షల కోట్లు అవసరమో.. ఎలా సమకూర్చుకుంటారో ప్రజలకు వివరించాలి. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు రావు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 ఎప్పటి నుంచి ఇస్తారు?’’ అని కిషన్రెడ్డి ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!