Pawan Kalyan: పవన్‌కు కృష్ణా జిల్లా ఎస్పీ నోటీసులు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా నోటీసులు ఇచ్చారు.

Updated : 04 Oct 2023 12:45 IST

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా నోటీసులు ఇచ్చారు. పెడన వారాహి యాత్రలో దాడులు చేస్తారని.. దీనిపై విశ్వసనీయ సమాచారం ఉందని మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో పవన్‌ వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో దాడులపై సమాచారం ఉంటే ఇవ్వాలని పవన్‌కు జిల్లా ఎస్పీ నోటీసులు జారీ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని ఎస్పీ చెప్పారు. పెడనలో వారాహి యాత్రకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని