KTR: తెలంగాణతో సమానంగా వృద్ధి చెందిన రాష్ట్రాన్ని చూపించగలరా?: మోదీకి కేటీఆర్‌ సవాల్‌

హైదరాబాద్‌ పర్యటనలో ప్రధాని మోదీ చేసిన విమర్శలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. గడిచిన 9 ఏళ్లలో తెలంగాణతో సమానంగా వృద్ధి చెందిన రాష్ట్రాన్ని చూపించగలరా?అని ట్విటర్‌ వేదికగా ఆయన సవాల్‌ విసిరారు.

Updated : 09 Apr 2023 16:33 IST

హైదరాబాద్: కేవలం రాజకీయాల కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ వచ్చారని భారాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. భారాసపై ప్రధాని మోదీ విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన ట్విటర్‌ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘దేశ జీడీపీ వృద్ధికి తోడ్పడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం, అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్క్‌, ప్రపంచ వ్యాక్సిన్‌ హబ్‌లు తెలంగాణ ప్రత్యేకతలు. రాష్ట్ర యువత కోసం అత్యధిక ఐటీ ఉద్యోగాలను సృష్టిస్తున్నాం. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేశాం. దేశంలో ఉత్తమ గ్రామీణ అభివృద్ధి నమూనా కలిగి వంద శాతం ఓడీఎఫ్‌ ప్లస్‌ సాధించాం. వరి ఉత్పత్తి చేస్తున్న రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఎన్నో అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న తెలంగాణ గురించి మోదీ నోటి నుంచి ఒక్క అభినందనా రాలేదు. గడిచిన 9 ఏళ్లలో తెలంగాణతో సమానంగా వృద్ధి చెందిన ఒక్క రాష్ట్రాన్ని చూపించగలరా?’’అంటూ మోదీకి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు