Karnataka: అసెంబ్లీని కుదిపేసిన.. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం ఘటన
కర్ణాటకలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం ఘటన ఆ రాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది. వ్యవసాయ శాఖ మంత్రి చలువరాయస్వామిని కేబినెట్ నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
బెంగళూరు: కర్ణాటకలోని (Karnataka) నాగమంగళ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం గురువారం ఆ రాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది. వ్యవసాయశాఖ మంత్రి చలువరాయస్వామి (Chaluvarayaswamy)ని కేబినెట్ నుంచి తొలగించాల్సిందిగా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మంత్రి.. అతడిని బదిలీ చేయించారంటూ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల వ్యాఖ్యలను సిద్ధరామయ్య ఖండించారు. బదిలీలు సాధారణమేనని, దానికి రాజకీయ రంగుపులమడం సరికాదన్నారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఆర్టీసీ డ్రైవర్ జగదీశను నాగమంగళ డిపో నుంచి ముద్దూరు డిపోకు అత్యవసరంగా బదిలీ చేస్తూ ఆర్టీసీ అధికారులు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఉన్నతాధికారులను సంప్రదించగా.. అతడిపై ఫిర్యాదులు ఉన్నాయని, పై నుంచి ఆదేశాలు రావడంతోనే బదిలీచేయాల్సి వచ్చిందని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన జగదీశ తన మృతికి వ్యవసాయశాఖ మంత్రి చలువరాయస్వామి కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు సకాలంలో గుర్తించి ఆయన్ను మైసూరులోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ జగదీశను ఇవాళ సాయంత్రం మాజీ సీఎం కుమారస్వామి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి చలువరాయస్వామి వేధింపుల వల్లే అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు. డ్రైవర్ భార్య గ్రామ పంచాయతీ సభ్యురాలిగా ఉన్నారని.. కాంగ్రెస్కు మద్దతివ్వాలని మంత్రి పలుమార్లు కోరినా.. ఆమె వ్యతిరేకించారన్నారు. దీంతో ఎలాగైనా ఇబ్బందులకు గురిచేయాలని భావించి.. ఆమె భర్తను బదిలీ చేయించారని కుమారస్వామి ఆరోపించారు. ప్రజల జీవితాలతో మంత్రులు ఆటలాడుకుంటున్నారని విమర్శించారు. ప్రజలకు రక్షణ కల్పించాలనుకుంటే వెంటనే సదరు మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కుమారస్వామి ఆరోపణలపై హోంశాఖ మంత్రి జి. పరమేశ్వర కూడా స్పందించారు. సీనియర్ పోలీసు అధికారులతో ఈ కేసును దర్యాప్తు చేయిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే రవాణశాఖ అధికారులనూ దర్యాప్తులో భాగస్వాముల్ని చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
సీఎం రేవంత్రెడ్డి స్థాయి మరిచి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ