Telangana News: గ్రామీణ ప్రాంతాలకు నేరుగా నిధులిస్తే తప్పేంటి?: రఘునందన్రావు
పంచాయతీల్లో జరిగే ప్రతి పనికి కేంద్రం నిధులు ఇస్తుందని, అవినీతి లేకుండా ఉండేందుకే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం డబ్బులను నేరుగా ఖాతాల్లో వేస్తుందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు.
హైదరాబాద్: పంచాయతీల్లో జరిగే ప్రతి పనికి కేంద్రం నిధులు ఇస్తుందని, అవినీతి లేకుండా ఉండేందుకే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం డబ్బులను నేరుగా ఖాతాల్లో వేస్తుందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. గ్రామ పంచాయతీల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు వేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఎలా ఇస్తుందని సీఎం కేసీఆర్ ప్రశ్నించడం ఏంటని ఆక్షేపించారు. అన్ని పథకాలకు కేంద్రం నిధులిస్తే.. తెరాస చేసినట్లు ప్రచారం చేసుకుంటోందన్నారు. తెలంగాణను చూసి పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్ అంటున్నారని.. మరి భారతదేశం లేకపోతే తెలంగాణ ఎక్కడుంటుందన్నారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత దేశ సమగ్రతకు భంగం కలిగించే విధంగా మాట్లాడొద్దని సూచించారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్లకు రాజ్యసభ సీట్లు కేటాయించారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్కు ఉద్యమకారులు ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు. అగ్రకులాల వారికే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని రఘునందన్రావు ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్