raja singh: గోషామహల్‌కు ప్యాకేజీ ప్రకటిస్తే నేను రాజీనామా చేస్తా!

తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, దయ చేసిన తన అసెంబ్లీలో ఒక ప్యాకేజీ ప్రకటించాలని

Updated : 02 Aug 2021 14:27 IST

హైదరాబాద్‌: తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, దయ చేసి తన అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్యాకేజీ ప్రకటించాలని గోషామహల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘ఉప ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు గుర్తుకు వస్తారు. హుజూరాబాద్‌లో గెలవడానికి ప్యాకేజీలను ప్రకటించారు. తమ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ప్యాకేజీలు వస్తాయని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గోషామహాల్ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం మంచి ప్యాకేజీ ప్రకటించండి. రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా’ అంటూ రాజా సింగ్‌ వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని