Janasena: దోపిడీదారుల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు విముక్తి కల్పించాలి: నాగబాబు

అవినీతిపరులు, దోపిడీదారుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి, భవిష్యత్తు తరాలను కాపాడుకోవటానికి జనసేనను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని

Published : 26 Jun 2022 01:37 IST

హైదరాబాద్‌: అవినీతిపరులు, దోపిడీదారుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి, భవిష్యత్తు తరాలను కాపాడుకోవటానికి జనసేనను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు కొణిదెల నాగబాబు అన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో బలంగా ప్రచారం చేస్తూ, జనసేన గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్య కార్యకర్తలతో హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాయలంలో నాగబాబు సమావేశమయ్యారు.

రాష్ట్రంలో అమూల్యమైన వనరులు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో, ప్రజా ఆమోద పరిపాలన అందించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందన్నారు. దోపిడీకి గురవుతున్న రాష్ట్ర ఆర్థిక వనరులు, ప్రకృతి సంపదను కాపాడే సమర్థత జనసేనకు మాత్రమే ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి జనసేన దగ్గర వినూత్నమైన ప్రణాళికలు ఉన్నాయని, పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి అయ్యే వరకు తాను ఒక కార్యకర్తగా పనిచేస్తానని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా గ్రామీణ స్థాయిలో విస్తరించి పనిచేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. కార్యకర్తలంతా సమష్టిగా పనిచేయాలని సూచించారు. జనసేన అధినేత పవన్‌ పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీతో సమావేశమయ్యారు. సభలు, కార్యక్రమాలకు అనుసరించాల్సిన ప్రణాళికపై పవన్‌ దిశానిర్దేశం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని