Lokesh: నేను ఏమన్నానని నోటీసులిచ్చారు?: లోకేశ్‌

దక్షిణ భారత బిహార్‌గా ఆంధ్రప్రదేశ్‌ని మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు.

Updated : 06 Sep 2023 17:27 IST

వెంప: దక్షిణ భారత బిహార్‌గా ఆంధ్రప్రదేశ్‌ని మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వెంపలో క్షత్రియ సామాజిక వర్గం ప్రతినిధులతో లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు.

లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘‘నా పాదయాత్రలో రాళ్లు, సీసాలతో దాడులు చేశారు. ఎంపీ రఘురామ సొంత నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేదు. రఘురామను పలురకాలుగా వేధిస్తున్నారు. నాకు రక్షణ కోసం ఉన్న యువగళం వాలంటీర్లను తీసుకెళ్లారు. అసలు నేను ఏమన్నానని నాకు నోటీసులు ఇచ్చారు? వైకాపా నేతలకు చట్టాలు చుట్టాలుగా మారాయి. కొందరు పోలీసుల వల్ల ఆ శాఖలోని అందరికీ చెడ్డపేరు వస్తోంది’’ అని లోకేశ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని