Politics: మరో పాతికేళ్లు అధికారంలో ఉంటాం: సుప్రియా సూలే
కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాల నేతలను టార్గెట్ చేస్తోందని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఆరోపించారు. ఇలాంటి అధికార దుర్వినియోగాన్ని తన జీవితంలో చూడలేదన్నారు.....
నాగ్పుర్: కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాల నేతలను టార్గెట్ చేస్తోందని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఆరోపించారు. ఇలాంటి అధికార దుర్వినియోగాన్ని తన జీవితంలో చూడలేదన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నాగ్పుర్కు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, భాజపా నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ నిన్న భేటీ కావడంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. రాజకీయ సిద్ధాంతాలను పక్కనబెట్టి వారిద్దరూ భేటీ కావడాన్ని స్వాగతిస్తానన్నారు. ఓబీసీ కోటా అంశంపై ముంబయిలో జరిగిన అఖిలపక్ష సమావేశం తర్వాత ఫడణవీస్, ఠాక్రే దాదాపు 20 నిమిషాల పాటు విడిగా భేటీ అయ్యారు. దీనిపై విలేకర్లు ఆమెను ప్రశ్నించగా.. సిద్ధాంతాలను పక్కనబెట్టి మంచి సంబంధాలు కొనసాగించడం మంచిదేనని అభిప్రాయపడ్డారు. అలాంటి వాటిని తాను స్వాగతిస్తానన్నారు.
మరో 25 ఏళ్లు అధికారంలో మేమే..
కరోనా మహమ్మారితో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు నిలిపివేసినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజాప్రతినిధులకు నిధులు మంజూరుచేస్తోందన్నారు. అంటే దీని అర్థం కేంద్ర ప్రభుత్వం కన్నా మహారాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నట్టే కదా అంటూ విలేకర్లు అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. శివసేన- ఎన్సీపీ- కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం మరో 25 ఏళ్ల వరకు రాష్ట్రాన్ని పాలిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్