Bommai: అలాంటి చర్చలేం జరగలేదు.. రాజకీయాల్లో భవిష్యత్తును అంచనా వేయడం కష్టం!
Basavaraj Bommai: కర్ణాటకలో భాజపా, జేడీఎస్ మధ్య అవగాహనకు చర్చలు జరుగుతున్నట్టు వస్తోన్న ఊహాగానాలపై మాజీ సీఎం, భాజపా సీనియర్ నేత బసవరాజ్ బొమ్మై స్పందించారు.
హుబ్బళ్లి: లోక్సభ ఎన్నికలు(Lok Sabha polls) సమీపిస్తున్న వేళ జేడీఎస్(JDS) భాజపాకు దగ్గరవుతోందని, ఆ రెండు పార్టీల మధ్య అవగాహనకు చర్చలు జరుగుతున్నట్టు వస్తోన్న వార్తలపై కర్ణాటక మాజీ సీఎం, భాజపా నేత బసవరాజ్ బొమ్మై(Basavaraj Bommai) స్పందించారు. జేడీఎస్(JDS)తో ఎన్నికల అవగాహనకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఎలాంటి చర్చలూ జరగలేదని స్పష్టంచేశారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలని వ్యాఖ్యానించిన బొమ్మై.. రాజకీయాల్లో భవిష్యత్తును అంచనా వేయడం కష్టమన్నారు. కాంగ్రెస్ను నిలువరించేందుకు పలు పార్టీలు ఏకమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయని విలేకర్లు ఆయన వద్ద ప్రస్తావించగా.. ‘‘అలాంటి చర్చలు జరుగుతున్నట్టు మీడియాలో వస్తున్నాయి. దీనిపై అన్ని ఛానళ్లలో చర్చలు జరుగుతున్నాయి. మేం నిశితంగా గమనిస్తున్నాం’’ అన్నారు.
ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఫలితాల తర్వాత జేడీఎస్ భాజపాతో పొత్తు పెట్టుకొనేందుకు చూస్తోందంటూ కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి సైతం ఇటీవల దిల్లీ పర్యటనలో పలువురు భాజపా సీనియర్ నేతలను కలిశారు. అలాగే, లోక్సభ ఎన్నికల్లో అవగాహనపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్న కుమారస్వామి.. ఈ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపాదన ప్రస్తుతానికి తమ ముందు లేదంటూ సోమవారం వ్యాఖ్యానించడం గమనార్హం. భాజపా, జేడీఎస్ మధ్య పొత్తుకు అవకాశాలపై ఊహాగానాలు, అలాగే, లోక్సభ ఎన్నికల్లో తాను పోటీచేసే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో భాజపా దాదాపు క్లీన్స్వీప్ చేసింది. మొత్తం 28 సీట్లకు గాను భాజపా 25స్థానాల్లో సత్తా చాటగా.. జేడీఎస్, కాంగ్రెస్, స్వతంత్రులు చెరో స్థానంలో విజయం సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్