Uttar pradesh: లుంగీ ధరించిన వారంతా నేరస్థులా?: కాంగ్రెస్
ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు వ్యూహాత్మక ప్రచారాలు.. ప్రసంగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, భాజపా నేత కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రయాగ్రాజ్లో
లఖ్నవూ: ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు వ్యూహాత్మక ప్రచారాలు.. ప్రసంగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, భాజపా నేత కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రయాగ్రాజ్లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన.. లుంగీ, టోపీ ధరించిన వ్యక్తులు గతంలో శాంతిభద్రతలకు సవాలుగా మారేవారని అన్నారు. 2017కు ముందు లుంగీలు ధరించిన వ్యక్తులు వ్యాపారుల్ని తుపాకులతో బెదిరించేవారని, స్థలాలు కబ్జా చేసేవారని వ్యాఖ్యానించారు. భాజపా ప్రభుత్వం వచ్చాక అలాంటి నేరస్థులు కనిపించట్లేదన్నారు. మౌర్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రషీద్ అల్వీ మాట్లాడుతూ.. ‘యూపీలో ఉండే హిందువుల్లో సగం మంది లుంగీ ధరిస్తారు. మౌర్య వ్యాఖ్యల ప్రకారం లుంగీ ధరించిన వారంతా నేరస్థులేనా?’’అని ప్రశ్నించారు. భాజపా కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజలు భాజపా వ్యవహరిస్తున్న తీరును అర్థం చేసుకున్నారని, అది తెలిసి అధికార పార్టీ భయపడుతోందని రషీద్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం