Annamalai: ₹500 కోట్లకు డీఎంకే నోటీసులు.. చట్టపరమైన చర్యలకు సిద్ధమేనన్న అన్నామలై
తమిళనాడు సీఎం స్టాలిన్పై చేసిన నిరాధార ఆరోపణలకు గాను బహిరంగ క్షమాపణతో పాటు రూ.500 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ డీఎంకే ఇచ్చిన లీగల్ నోటీసులపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పందించారు.
చెన్నై: డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin)పై అవినీతి ఆరోపణలు చేసిన భాజపా రాష్ట్ర చీఫ్ అన్నామలై క్షమాపణలు చెప్పాలని, పరువు నష్టం కింద రూ.500 కోట్లు చెల్లించాలంటూ అధికార పార్టీ లీగల్ నోటీసులు పంపడంపై ఆయన స్పందించారు. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలకు తాను సిద్ధంగానే ఉన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్లో అన్నామలై ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే, తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు గాను అధికార పార్టీ కూడా తనకు అంతే మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందన్నారు. గతంలో డీఎంకే హయాంలో జరిగిన మెట్రో రైలు ప్రాజెక్టులో అవినీతి జరిగిందనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని.. వీటిని సీబీఐకి అప్పగిస్తామని అన్నామలై పేర్కొన్నారు.
తనకు లీగల్ నోటీసులు పంపిన డీఎంకే సంస్థాగత కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు ఆర్ఎస్ భారతిపై అన్నామలై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్కు, ఆ ప్రాజెక్టులో జోక్యం ఉన్నవారికి సీబీఐ నోటీసులు ఇచ్చేంతవరకు ఓపికతో వేచి చూడాలంటూ ఆర్ఎస్ భారతికి సూచించారు. మరోవైపు, ‘డీఎంకే ఫైల్స్’ పేరుతో విడుదల చేసిన 15 నిమిషాల వీడియోలో భాజపా తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలై (Annamalai) అసంబద్ధ ఆరోపణలు చేశారని, డీఎంకే నేతల ఆస్తులను పెంచేసి చూపించారంటూ నిన్న డీఎంకే ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ఇందుకుగానూ అన్నామలై వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతోపాటు తమ పరువుకు నష్టం కలిగించినందుకు పరిహారంగా రూ.500 కోట్లను చెల్లించాలంటూ ఆర్ఎస్ భారతి తన నోటీసుల్లో పేర్కొన్నారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తన 56 ఏళ్ల ప్రజా జీవితంలో అక్రమంగా ఒక్క పైసా కూడా ఏ ఒక్కరి నుంచి తీసుకోలేదన్నారు. అందువల్ల నిరాధార ఆరోపణలు చేసినందుకు ఈ నోటీసులు అందిన 48 గంటల్లో అన్నామలై బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పడంతో పాటు రూ.500 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా.. డీఎంకే ఆరోపణలపై అన్నామలై ఎదురుదాడికి దిగారు. అరుంధతి ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.84 కోట్లు తీసుకున్నట్టుగా ఆర్ఎస్ భారతి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపైనా, భాజపా పైన ఆరోపణలు చేసినందుకు రూ.501 కోట్లు చెల్లించాలని డిమాండ్చేశారు. ఆ మొత్తాన్ని తాను పీఎం కేర్స్ నిధికి జమ చేస్తానని చెప్పారు. తనపైనా, భాజపా పైనా ఆర్ఎస్ భారతి చేసిన ఆరోపణలకు తగిన వివరణ ఇవ్వకపోతే 48 గంటల్లో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్