Revanth: ధరణి లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి: రేవంత్ రెడ్డి
తెలంగాణలో ధరణి లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రూ.90వేల కోట్లు అప్పు చేసి వివిధ బ్యాంకులను నిండా ముంచిన, దివాలా తీసిన ఐఎల్ ఆండ్ ఎఫ్ఎస్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడంపై ఆయన మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణలో ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ రాష్ట్ర ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణిని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నాయకుల సహకారంతో కొందరు అక్రమార్కులు భూ కుంభకోణాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల ఆరోపించిన రేవంత్ రెడ్డి.. తాజాగా ధరణి పుట్టుక దగ్గర నుంచి దాన్ని ఏ విధంగా ప్రైవేటు సంస్థకు అప్పగించారు? తద్వారా ప్రజలకు కలుగుతున్న నష్టం ఏమిటి? అనే అంశాలను వివరించారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ సైబర్ నేరగాళ్ల మాదిరిగా ధరణి పేరుతో తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. ధరణి పోర్టల్ వెనకాల దొరలు, రాజులు ఉన్నారని, కేసీఆర్ దోపిడీ, దొంగతనాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన రెవెన్యూ రికార్డులను ధరణి పేరుతో పూర్తిగా ప్రయివేటు కంపెనీ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్కు కట్టబెట్టారని రేవంత్ మండిపడ్డారు. రూ. వేల కోట్లు అప్పు తీసుకుని వివిధ బ్యాంకులను నిండా ముంచి, దివాలా తీసిన కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా ఒప్పందం చేసుకుంటుందని ప్రశ్నించారు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీకి చెందిన ధరణి నిర్వహిస్తున్న టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ 52.26 శాతం వాటాను ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఫాల్కన్ కంపెనీకి రూ.1,275 కోట్లకు అమ్ముకుందని ఆరోపించారు. టెర్రాసిస్ కంపెనీ 99 శాతం వాటా ఫాల్కన్ కంపెనీకి ఇచ్చేసిందన్నారు. ఇప్పుడు ధరణి పోర్టల్ పూర్తిగా శ్రీధర్ రాజు చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. 75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ, నాయకుడు కేసీఆర్ మాదిరిగా దోపిడీకి పాల్పడలేదని ధ్వజమెత్తారు.
ధరణిలో ఇప్పటివరకు రూ.50వేల కోట్లు విలువైన 25 లక్షల లావాదేవీలు జరిగినట్లు అంచనా వేయగా, జరుగుతున్న లావాదేవీలకు చెందిన డబ్బు ప్రభుత్వ ఖాతాల్లోకి వెళ్లడం లేదని, అవన్నీ శ్రీధర్ రాజు కంపెనీ ఖాతాలోకి వెళ్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే తిరిగి డబ్బులు రావడం లేదని, ఇలా ఎన్ని వందల కోట్లు కంపెనీ ఖాతాలోకి వెళ్తున్నాయో గుట్టు రట్టు చేయాలని డిమాండ్ చేశారు. ధరణిలో జరిగిన 25 లక్షల లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ధరణి వ్యవహారంపై విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే న్యాయస్థానాల తలుపు కూడా తడతామని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!