Sanjay Raut: ఠాక్రేకు వెన్నుపోటు.. ఇదిగో ఇలాగే..!
మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి ముగింపు దశకు చేరుకుంది. బలపరీక్షకు గవర్నర్ ఆదేశించడం, అందులో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో.. ఇక సభలో మెజారిటీ నిరూపణ కష్టమని నిర్ధారించుకున్న ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
చిత్రం షేర్ చేసి.. మండిపడ్డ సంజయ్ రౌత్
ముంబయి: మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి ముగింపు దశకు చేరుకుంది. బలపరీక్షకు గవర్నర్ ఆదేశించడం, అందులో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో.. ఇక సభలో మెజారిటీ నిరూపణ కష్టమని నిర్ధారించుకున్న ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాంతో తదుపరి కార్యాచరణపై భాజపా, అసమ్మతి ఎమ్మెల్యేలు చకచకా పావులు కదుపుతున్నారు. ఈ పరిణామాలపై స్పందించిన శివసేన (Shiv Sena) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut).. ప్రభుత్వం కూలడానికి కారణమైన తిరుగుబాటు నేతలపై తీవ్రంగా మండిపడ్డారు.
‘నిన్న ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేసినప్పుడు మేమంతా ఉద్వేగానికి గురయ్యాం. ప్రతి ఒక్కరికీ ఆయనపై విశ్వాసం ఉంది. ప్రతివర్గం మద్దతు ఉంది. సోనియా గాంధీ, శరద్ పవార్ ఆయనపై నమ్మకం ఉంచారు. శివసేన అధికారం కోసం పుట్టలేదు. అధికారమే శివసేన కోసం పుట్టింది. ఇదే ఎల్లప్పుడూ బాలా సాహెబ్ చెప్పే మంత్రం. ఇక్కడితో మా పోరాటాన్ని ఆపబోం. మరోసారి మా సొంతంగా అధికారాన్ని చేపట్టేందుకు కృషి చేస్తాం’ అని రౌత్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అసమ్మతి ఎమ్మెల్యేలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. వారు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు వెన్నుపోటు పొడిచారంటూ ఓ చిత్రం రూపంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిని ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘ఇప్పుడు రాష్ట్రంలో సరిగ్గా ఇదే జరిగింది’ అంటూ మండిపడ్డారు.
రేపు ఈడీ ముందు హాజరవుతా..
ఈ రాజకీయ సంక్షోభ సమయంలోనే సంజయ్ రౌత్కు ఈడీ నోటీసులు అందిన సంగతి తెలిసిందే. సంజయ్ రౌత్ భార్య, ఆయన స్నేహితుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన ముంబయిలోని గోరెగావ్ పాత్రచాల్ భూ కుంభకోణం, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో చోటుచేసుకున్న నగదు అక్రమ చలామణీకి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా రౌత్కు సమన్లు జారీ చేసినట్టు దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు.. జులై 1వ తేదీన విచారణకు రావాలని ఆదేశించారు. ఈ సమన్లపై ఆయన స్పందిస్తూ.. ‘నేను రేపు ఈడీ కార్యాలయానికి వెళ్తున్నాను’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్