Atchannaidu: చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడమే జగన్‌ పని: అచ్చెన్నాయుడు

నా ఎస్సీ.. నా ఎస్టీ అంటూ వారిపైనే ఏపీ సీఎం జగన్‌ దాడి చేస్తున్నారని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.

Published : 06 Nov 2023 15:26 IST

అమరావతి: ‘నా ఎస్సీ.. నా ఎస్టీ’ అంటూ వారిపైనే ఏపీ సీఎం జగన్‌ దాడి చేస్తున్నారని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన పథకాలన్నీ జగన్‌ రద్దు చేశారని విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దళిత సమ్మేళన సభలో ఆయన మాట్లాడారు.

‘‘తెదేపా అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడమే జగన్‌ పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు జైలు నుంచి వస్తుంటే అనేక మంది స్వాగతం పలికారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ఆయన రాత్రింబవళ్లు కష్టపడ్డారు. తెదేపా హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకలో కూడా అవినీతి జరిగిందని కేసు పెట్టారు. రాష్ట్రానికి జగన్‌ తీరని నష్టం చేశారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లారు. రానున్న ఎన్నికల్లో పులివెందుల సహా అన్ని స్థానాల్లో తెదేపా గెలుపు ఖాయం’’ అని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని