AP Politics : అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోం : బుద్దా వెంకన్న

తెదేపా అధినేత చంద్రబాబు సహా పార్టీ నేతలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి తప్పించాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్‌ చేశారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గాన్ని మార్చేస్తాని సీఎం జగన్‌ చెప్పడం వల్లే పదవిని...

Published : 25 Jan 2022 18:42 IST

విజయవాడ : తెదేపా అధినేత చంద్రబాబు సహా పార్టీ నేతలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి తప్పించాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్‌ చేశారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గాన్ని మార్చేస్తానని సీఎం జగన్‌ చెప్పడం వల్లే పదవిని కాపాడుకునేందుకు నాని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని సహించబోమని, మాటకుమాట బదులిస్తామని స్పష్టం చేశారు. ‘‘ చంద్రబాబును తిడితే పదవి ఉంటుందని కొడాలి భావిస్తున్నారు. అభ్యంతరకర వ్యాఖ్యల పేరిట నాతోపాటు తెదేపా నేతలపై కేసులు పెట్టారు. బూతులు మాట్లాడుతున్న కొడాలిపై పోలీసులు కేసు ఎందుకు పెట్టడం లేదు? రెండున్నర ఎకరాల్లో కన్వెన్షన్‌ సెంటర్‌ కట్టడానికి నానికి డబ్బు ఎలా వచ్చింది? గుడివాడ వెళ్లడానికి ఏ పార్టీ వారినీ పోలీసులు ఎందుకు అనుమతించడం లేదు. చంద్రబాబు సహా తెదేపా నేతలపై కొడాలి నాని వ్యాఖ్యలు సరికాదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని