Huzurabad by election: తెరాస నేత కౌశిక్రెడ్డికి చేదు అనుభవం.. స్థానికేతరుడంటూ అడ్డగింత
హుజూరాబాద్లో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాగా ఆ నియోజకవర్గంలోని ఘన్ముక్లలో తెరాస నేత కౌశిక్రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ..
హుజూరాబాద్: హుజూరాబాద్లో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాగా ఆ నియోజకవర్గంలోని ఘన్ముక్లలో తెరాస నేత పాడి కౌశిక్రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఘన్ముక్ల పోలింగ్ కేంద్రం వద్దకు రాగా.. స్థానికేతరులకు ఇక్కడ ఏం పని అని అంటూ భాజపా శ్రేణులు నిలదీశారు. ఈ క్రమంలో కౌశిక్రెడ్డి, భాజపా శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. ఫలితంగా పోలింగ్ కేంద్రం కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం కౌశిక్రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉదయం 9 గంటల వరకు హుజూరాబాద్లో 10.50 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
వీణవంకలోనూ..
పోలింగ్ కేంద్రాల వద్ద తెరాస నేత కౌశిక్రెడ్డికి ఇబ్బందులు తప్పడం లేదు. ఘున్మక్లలాగే వీణవంక పోలింగ్ కేంద్రం వద్ద కూడా కౌశిక్రెడ్డిని అడ్డుకున్నారు. వీణవంక జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రానికి ఆయన వెళ్లగానే తెరాస మినహా ఇతర పార్టీల కార్యకర్తలు ఆయన్ను అడ్డుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్