TS politics: హుజూరాబాద్లో తెరాస, భాజపా మధ్యే పోటీ: హరీశ్రావు
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండున్నరేళ్లు తెరాస ప్రభుత్వమే ఉంటుందని.. ఏ పని చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని మంత్రి హరీశ్రావు తెలిపారు. ప్రజలు ఈటలకు ఓటు వేస్తే వారికి ఏం చేస్తారో ఆయన సమాధానం చెప్పాలన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో ఏర్పాటు చేసిన
ఇల్లందకుంట: తెలంగాణ రాష్ట్రంలో మరో రెండున్నరేళ్లు తెరాస ప్రభుత్వమే ఉంటుందని.. ఏ పని చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని మంత్రి హరీశ్రావు తెలిపారు. ప్రజలు ఈటలకు ఓటు వేస్తే వారికి ఆయన ఏం చేస్తారో సమాధానం చెప్పాలన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో ఏర్పాటు చేసిన తెరాస ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. ‘‘హుజూరాబాద్లో తెరాస, భాజపా మధ్యే పోటీ ఉంది. ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందే కనిపిస్తోంది. ఈటల హజూరాబాద్లో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. మంత్రిగా ఉన్నప్పుడే ఇళ్లు కట్టించలేకపోయిన ఈటల ఇప్పుడు గెలిస్తే కట్టిస్తారా?అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సీఎం పని చేస్తున్నారు’’ అని హరీశ్రావు అన్నారు.
కేసీఆర్కు పాదాభివందనాలు: గెల్లు శ్రీనివాస్యాదవ్
హుజూరాబాద్ తెరాస అభ్యర్థిగా ఎంపికైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు పాదాభివందనాలు తెలిపారు. పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ఈ అవకాశమిచ్చారని చెప్పారు. ‘‘తెరాస తరఫున హుజూరాబాద్లో పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు పాదాభివందనాలు. నన్ను గెలిపించాలని మంత్రి హరీశ్రావుకు బాధ్యతలు అప్పగించారు. విద్యార్థి నేతగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నా. దళిత, బహుజన విద్యార్థుల కోసం పోరాడా. పార్టీ కోసం నేను చేసిన సేవలు గుర్తించి ఈ అవకాశం ఇచ్చారు’’ అని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్