TS News: ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఉత్కంఠ.. తెరాసకు పోటీగా స్వతంత్ర అభ్యర్థి
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు ముగిసింది...
ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు తెరాస తరఫున దండెం విఠల్ నామినేషన్ వేయగా, తుడుందెబ్బ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పుష్పరాణి నామినేషన్ వేశారు. వీరితో పాటు మరో 22 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.
అయితే, నిన్న, ఇవాళ 20 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సంపత్ కుమార్ అనే వ్యక్తి ఎన్నికల అధికారిని కలిసి పుష్పరాణి నామినేషన్ ఉపసంహరించుకున్నారని తెలిపారు. నామినేషన్ పత్రంలో ప్రతిపాదించిన పేర్లలో సంపత్ కుమార్ పేరు లేకపోవడంతో అధికారులు అభ్యంతరం తెలిపారు. ఉపసంహరణపై పుష్పరాణితో ఫోన్ చేయించాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పుష్పరాణి తన నామినేషన్ ఉప సంహరించుకున్నారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఖండించిన పుష్పరాణి తాను బరిలో ఉన్నట్టు ప్రకటన విడుదల చేశారు. తనపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వీడియో సందేశం పంపారు. మరోవైపు నామినేషన్ల గడువు ముగియడంతో కలెక్టర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. పుష్పరాణి నామినేషన్ ఉపసంహరణపై దాదాపు 2గంటల పాటు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, బాల్క సుమన్, కోనేరు కోనప్ప, బాపూరావు, జోగు రామన్న, రేఖానాయక్తో పాటు తెరాస రాష్ట్ర, జిల్లా నాయకులు ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కాసేపటికి పుష్పరాణి కూడా కలెక్టరేట్ వద్దకు చేరుకోవడంతో భాజపా శ్రేణులు పుష్పరాణికి మద్దతు తెలిపారు. పుష్పరాణిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు యత్నించడంతో తుడుందెబ్బ, భాజపా శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో భాజపా, తెరాస శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. చివరిరి పుష్పరాణి బరిలో నిలవడంతో ఆదిలాబాద్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ అనివార్యమైంది. తెరాస తరఫున దండెం విఠల్, స్వతంత్ర అభ్యర్థిగా పెందూరి పుష్పరాణి బరిలో ఉన్నారు.
ఆదిలాబాద్ నుంచి నేనే ఒకరిని పోటీకి దించా: ఈటల
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో ఆదిలాబాద్ నుంచి తానే ఒకరిని పోటీకి దించానని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. ‘‘ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వస్తాయి? గెలుస్తామా? ఓడుతామా? అనేది పక్కన పెడితే కనీసం పోటీ చేయాలి. అందుకే ఆదిలాబాద్ నుంచి ఒకరిని బరిలో దించా. తెరాసకు ఏకగ్రీవం అవకాశం ఇవ్వొద్దు. పోటీ చేస్తే కేసీఆర్కు భయమైనా ఉంటుంది. కరీంనగర్లో ఒక స్థానంలో తెరాస ఓడిపోతుంది’’ అని ఈటల రాజేందర్ మీడియాతో అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే