Ap news: ఎంపీ భరత్‌.. వైకాపాను సర్వనాశనం చేస్తున్నారు: ఎమ్మెల్యే జక్కంపూడి

తమ పార్టీలోని ఒక నాయకుడు తెదేపా నాయకులతో కుమ్మక్కై తనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

Updated : 20 Sep 2021 18:56 IST

రాజమహేంద్రవరం: తమ పార్టీలోని ఒక నాయకుడు తెదేపా నాయకులతో కుమ్మక్కై తనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘పార్టీకి నష్టం కలిగించిన వారిని, కేసులు ఉన్నవారిని దూరంగా పెడితే.. వారిని తీసుకువచ్చి పార్టీలో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పార్టీకి నష్టం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి’’ అని రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్‌ను ఉద్దేశించి జక్కంపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న సీతానగరానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేస్తే అతడికి వత్తాసు పలకడం సరికాదన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉండగా కొందరు రైతులతో రాజమహేంద్రవరంలో బ్యాంకు ఖాతాలు తెరిపించి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయని మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్‌.. ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రూ.150 కోట్లతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టానని తెలిపారు. దీనిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తానని జక్కంపూడి స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని