రామగుండంలో తెరాస ఎంపీ, ఎమ్మెల్యే ధర్నా

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం పనులను పరిశీలించేందుకు  కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, మాన్‌ సుఖ్‌ లక్ష్మణ్‌భాయి శనివారం మధ్యాహ్నం రామగుండం విచ్చేశారు...

Published : 12 Sep 2020 13:22 IST

గోదావరిఖని పట్టణం: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం పనులను పరిశీలించేందుకు  కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, మాన్‌ సుఖ్‌ లక్ష్మణ్‌భాయి శనివారం మధ్యాహ్నం రామగుండం విచ్చేశారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్, రామగుండం ఎమ్మెల్యే చందర్‌తోపాటు తెరాస కార్యకర్తలు ఎరువుల కర్మాగారం ఎదుట ధర్నాకు దిగారు. స్థానికులకు ఉపాధి కల్పించకుండా ఉద్యోగాలను అమ్మకుంటున్నారని ఆరోపించారు. వారికి నచ్చజెప్పేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. మంత్రులు నిరసనకారుల వద్దకు వెళ్లగానే ఆందోళన మరింతగా పెరిగింది. భాజపా, తెరాస కార్యకర్తలు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టకేలకు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కేంద్రమంత్రులు ఎరువుల కర్మాగారం పరిశీలనకు వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని