రామగుండంలో తెరాస ఎంపీ, ఎమ్మెల్యే ధర్నా
పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం పనులను పరిశీలించేందుకు కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, మాన్ సుఖ్ లక్ష్మణ్భాయి శనివారం మధ్యాహ్నం రామగుండం విచ్చేశారు...
గోదావరిఖని పట్టణం: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం పనులను పరిశీలించేందుకు కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, మాన్ సుఖ్ లక్ష్మణ్భాయి శనివారం మధ్యాహ్నం రామగుండం విచ్చేశారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్, రామగుండం ఎమ్మెల్యే చందర్తోపాటు తెరాస కార్యకర్తలు ఎరువుల కర్మాగారం ఎదుట ధర్నాకు దిగారు. స్థానికులకు ఉపాధి కల్పించకుండా ఉద్యోగాలను అమ్మకుంటున్నారని ఆరోపించారు. వారికి నచ్చజెప్పేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. మంత్రులు నిరసనకారుల వద్దకు వెళ్లగానే ఆందోళన మరింతగా పెరిగింది. భాజపా, తెరాస కార్యకర్తలు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టకేలకు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కేంద్రమంత్రులు ఎరువుల కర్మాగారం పరిశీలనకు వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్