Assembly polls: కాంగ్రెస్లో చేరిన భాజపా బహిష్కృత నేత హరక్ సింగ్
భాజపా బహిష్కృత నేత, ఉత్తరాఖండ్ మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ తాజాగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దెహ్రాదూన్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో.....
దెహ్రాదూన్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన నేతలు ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. భాజపా బహిష్కృత నేత, ఉత్తరాఖండ్ మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ తాజాగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దెహ్రాదూన్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్.. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ.. అమిత్షాకు సన్నిహితుడైన హరక్ సింగ్ కాంగ్రెస్లో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాంగ్రెస్లో చేరిన సందర్భంగా హరక్ సింగ్ మాట్లాడుతూ భాజపాపై విమర్శలు గుప్పించారు. ‘నా అవసరం తీరాక భాజపా నన్ను వదిలేసింది. అది నన్ను తీవ్రంగా బాధించింది. నేను ఏ తప్పూ చేయలేదు. అమిత్ షాతో చివరి వరకు స్నేహాన్ని కొనసాగించా’ అని పేర్కొన్నారు. మార్చి 10న కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవలే రాష్ట్ర కేబినెట్ నుంచి హరక్ సింగ్ రావత్ను తొలగించిన భాజపా.. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని ఆరేళ్ల పాటు రద్దు చేసింది. రావత్ మంత్రి పదవి తొలగింపుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గవర్నర్కు లేఖ రాశారు. అయితే ఈ ఎన్నికల్లో తన బంధువులకు టికెట్లు ఇవ్వాలని పార్టీ నాయకత్వంపై హరక్ ఒత్తిడి తెచ్చారని.. అందుకే ఆయన్ను భాజపా బహిష్కరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. హరక్ కోడలు అనుకృతి గుసైన్ రావత్కు లాన్స్డౌన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్