దుబ్బాకలో ఎవరికి ఎన్ని ఓట్లొచ్చాయంటే?
దుబ్బాకలో భాజపా అభ్యర్థి రఘునందన్ రావు గెలుపును ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: దుబ్బాకలో భాజపా అభ్యర్థి రఘునందన్ రావు గెలుపును ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఆయనకు మొత్తంగా 63,352 ఓట్లు (38.47శాతం) వచ్చినట్టు వెల్లడించింది. తెరాస అభ్యర్థి సుజాతకు 62,273 ఓట్లు (37.82శాతం) రావడంతో ఆమె రెండో స్థానంలో నిలిచినట్టు తెలిపింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి 22,196 ( 13.48శాతం) ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కత్తి కార్తికకు 636 (0.39శాతం) ఓట్లు రాగా.. నోటాకు 554 ఓట్లు (0.34శాతం ) వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులకు 15,658 (9.5శాతం) ఓట్లు వచ్చినట్టు ఈసీ వెల్లడించింది. స్వతంత్ర అభ్యర్థుల్లో అత్యధికంగా బండారు నాగరాజుకు 3570 ఓట్లు వచ్చాయి. మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. తెరాస, భాజపా మధ్య ఆఖరు రౌండ్ దాకా సాగిన ఉత్కంఠ పోరులో భాజపా అభ్యర్థి రఘునందన్ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.