Bhumireddy: విజయనగరంలోనే ఉంటాం.. దమ్ముంటే వచ్చి అరెస్టు చేసుకోండి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి సవాల్‌

రాష్ట్ర పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి విమర్శించారు.

Updated : 09 Aug 2023 12:38 IST

విజయనగరం: రాష్ట్ర పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి విమర్శించారు. అంగళ్లు ఘర్షణ ఘటనలో తెదేపా అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరంలో ఉన్న భూమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సహా తామంతా విజయనగరంలోనే ఉన్నామని.. దమ్ముంటే వచ్చి అరెస్టు చేసుకోవాలని సవాల్‌ విసిరారు. 

‘‘ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక తేవాలని చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో వైకాపా వాళ్లే దాడులు చేస్తున్నారు. కేసులు మాత్రం మాపై పెడతున్నారు. ఆ దాడులకు పోలీసులే సాక్ష్యం. వారికి కూడా దెబ్బలు తగిలాయి. అక్రమ కేసులకు భయపడేది లేదు. ప్రజల కోసం జైలుకెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నాం. కేసులు న్యాయపరంగానే ఎదుర్కొంటాం ’’ అని భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని