Uday Samant: విపక్షాల భేటీ.. ప్రయోజనమేంటి?: ఉదయ్ సామంత్
బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిపక్షాల సమావేశంలో శివసేన (యూబీటీ)నేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) పాల్గొనడంపై మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్ విమర్శలు గుప్పించారు. ఈ భేటీతో ఎలాంటి ప్రయోజనం ఉండబోదని ఆయన వ్యాఖ్యానించారు.
ముంబయి: తాజా పరిస్థితులను చూస్తుంటే శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) తన భావజాలంతో రాజీపడి ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించిన వారి పక్కనే కూర్చున్నారని మహారాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి ఉదయ్ సామంత్ (Uday Samant) విమర్శించారు. ఒకరోజు ప్రధానిని చేస్తే ఆర్టికల్ 370ని రద్దు చేస్తానన్నది ‘బాలాసాహెబ్ ఠాక్రే’ కలని ఆయన అన్నారు. నీతీశ్ కుమార్ అధికారిక నివాసంలో జరిగిన సమావేశంతో ఎలాంటి ప్రయోజనం ఉండబోదన్నారు. వారి భవిష్యత్తు కోసమే నాయకులంతా అక్కడ సమావేశమయ్యారు తప్ప.. ప్రజల కోసం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సామంత్ మాట్లాడుతూ.. నీతీశ్ కుమార్ను భారత ప్రధానిని చేస్తామంటే మహారాష్ట్ర ప్రజలు ఒప్పుకోరని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ నరేంద్ర మోదీనే (modi) ప్రధానిమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నీతీశ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) హాజరవ్వడాన్ని ఉటంకిస్తూ.. తమ ఉనికిని కాపాడుకునేందుకే ఎంవీఏ పాల్గొందని ఎద్దేవా చేశారు. ఠాక్రే వర్గానికి, ఎన్సీపీకి రాజకీయ భవిష్యత్తు లేదని, వారి కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడికి సొంత పార్టీలోనే గౌరవం లేదన్నారు. భాజపాను గద్దె దించుతామంటూ విపక్ష పార్టీలన్నీ సమావేశమైనా.. ప్రధాని అభ్యర్థిని మాత్రం ప్రకటించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. భాజపా మద్దతుతో గెలిచిన వ్యక్తి ఇప్పుడు అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో నీతీశ్కుమార్ భాజపాకు మద్దతివ్వరని గ్యారెంటీ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలంతా నాయకుల నిజ స్వరూపాన్ని చూస్తున్నారని, దాన్ని బట్టే ఎన్నికల్లో వారి స్థానమేంటో నిర్ణయిస్తారని సామంత్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?