Crime News: విగ్గులో బంగారం స్మగ్లింగ్‌

సినిమాను తలపించే స్మగ్లింగ్‌ సన్నివేశం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో

Published : 22 Apr 2022 10:13 IST

సినిమాను తలపించే స్మగ్లింగ్‌ సన్నివేశం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించింది. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. అతడి స్మగ్లింగ్‌ శైలిని చూసి.. అధికారులు ఆశ్చర్యపోయారు. బంగారాన్ని పేస్ట్‌గా చేసి.. అందులో కొంత తల విగ్గులో.. మరికొంత తన పురీషనాళంలో దాచి పెట్టాడు. అబుదాబి నుంచి వస్తున్న అతడి వద్ద స్వాధీనం చేసుకున్న పసిడి విలువ రూ.30 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. తొలుత నిందితుడిని అనుమానించిన అధికారులు.. అతని సామగ్రి తనిఖీ చేయగా.. ఏమీ కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి.. అవసరమైన పరీక్షలు చేశారు. అలా అసలు విషయం బయటపడింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని