2వ తేదీ లోగా బంగళాలను ఖాళీ చేయాలి!

గతంలో కేటాయించిన నివాసాలను మే 2వ తేదీలోగా ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం 8 మంది ప్రముఖ కళాకారులకు తెలిపింది. చాలా ఏళ్ల క్రితం వారికి ప్రభుత్వం కేటాయించిన ఈ వసతులు 2014లో

Published : 28 Apr 2022 04:57 IST

8 మంది కళాకారులకు గడువిచ్చిన కేంద్రం

దిల్లీ: గతంలో కేటాయించిన నివాసాలను మే 2వ తేదీలోగా ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం 8 మంది ప్రముఖ కళాకారులకు తెలిపింది. చాలా ఏళ్ల క్రితం వారికి ప్రభుత్వం కేటాయించిన ఈ వసతులు 2014లో రద్దయ్యాయి. మొత్తం 28 మందికి గాను ఇంకా 8 మంది ప్రభుత్వ వసతులను ఖాళీ చేయలేదని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. వీరందరికీ పలుమార్లు నోటీసులు కూడా ఇచ్చినట్లు చెప్పారు. తాము బంగళాలను ఖాళీచేసే పనిలోనే ఉన్నామని, అయితే కొంత సమయం కావాలని వారు కోరినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని