ప్లేఆఫ్స్ లక్ష్యంగా పోరుకు సిద్ధం
అబుదాబి మరో రసవత్తరపోరుకు సిద్ధమైంది. టీ20 క్రికెట్ లీగ్లో భాగంగా 35వ మ్యాచ్ హైదరాబాద్, కోల్కతా మధ్య జరగనుంది. గత మ్యాచుల్లో ఓటమి చవిచూసిన రెండు జట్లు ప్లేఆఫ్స్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
నేడు కోల్కతాతో తలపడనున్న హైదరాబాద్
ఇంటర్నెట్ డెస్క్: అబుదాబి మరో రసవత్తరపోరుకు సిద్ధమైంది. టీ20 క్రికెట్ లీగ్లో భాగంగా 35వ మ్యాచ్ హైదరాబాద్, కోల్కతా మధ్య జరగనుంది. గత మ్యాచుల్లో ఓటమి చవిచూసిన రెండు జట్లు ప్లేఆఫ్స్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 3.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాబలాలేంటో ఓసారి చూద్దాం.
గత సీజన్ను గుర్తు చేయాలి..
హైదరాబాద్ జట్టులో గత సీజన్కు.. ఈ సీజన్కు తేడా ఏంటంటే..? ఓపెనింగ్ భాగస్వామ్యం. 2019లో డేవిడ్ వార్నర్, బెయిర్స్టో కలిసి సృష్టించిన వీరంగం అంతాఇంతా కాదు. కానీ.. ఇప్పుడు ఆ విధ్వంసకరమైన ఓపెనింగ్ ఇన్నింగ్స్ కనిపించడం లేదు. ప్లేఆఫ్స్ దగ్గరపడుతున్నాయి. వార్నర్సేన ముందుకు వెళ్లాలంటే ఇక నుంచి ఆడే ప్రతి మ్యాచ్లోనూ గెలవాల్సిన పరిస్థితి. అందుకే.. ఈ ఓపెనింగ్ జోడీ తమ విధ్వంసం పునరావృతం చేయాల్సిన అవసరం ఉంది. మిడిల్ ఆర్డర్లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శనల్లేవు. ఆ జట్టు బ్యాట్స్మెన్లో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నది నలుగురు మాత్రమే. ప్రియం గార్గ్ ఒక్క మ్యాచ్లో తప్పితే మరోసారి తన ప్రతిభ చూపించలేకపోయాడు. దీంతో అతని స్థానంలో అభిషేక్శర్మ లేదా విరాట్సింగ్ను జట్టులోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. ఆడిన ఎనిమిదింట్లో మూడు విజయాలు, ఐదు ఓటములతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది.
ఆరు మ్యాచుల్లో వికెట్ తీయని కమిన్స్..
కెప్టెన్ను మార్చినా కోల్కతా తీరు మారలేదు. జట్టు నిండా ప్రతిభావంతులైన క్రికెట్లున్నప్పటికీ ఆ జట్టు ఓటమికి దాసోహమంటోంది. దినేశ్ కార్తిక్ నుంచి సారథ్య బాధ్యతలను అందుకున్న ఇయాన్ మోర్గాన్ తొలి మ్యాచ్లోనే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. నిజానికి కోల్కతాలో ప్రధాన లోపం బౌలింగ్. ఎన్నో అంచనాలతో తీసుకున్న ఆసీస్ ఫాస్ట్ బౌలర్ కమిన్స్ తన స్థాయి ప్రదర్శన చేయడం లేదు. ఈ సీజన్లో ఆరు మ్యాచుల్లో ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కోల్కతా ఈ విషయంపై దృష్టి పెడితే మరో పేసర్ ఫెర్గుసన్ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. బ్యాటింగ్లో దినేశ్ కార్తిక్, నితీశ్ రాణా తిరిగి ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉంది. వార్నర్సేనతో పోలిస్తే కోల్కతాది మెరుగైన పరిస్థితి. ఆ జట్టు ఆడిన ఎనిమిది మ్యాచుల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలోనూ నాలుగోస్థానంలో ఉంది.
రికార్డుల మాట..
ఈ రెండు జట్లు ఇప్పటి వరకూ 18 మ్యాచుల్లో తలపడ్డాయి. వాటిలో 11 విజయాలతో కోల్కతా పైచేయి సాధించింది. ఈ సీజన్లో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లోనూ కోల్కతా విజయం సాధించింది. ఈ రోజు మ్యాచ్ జరుగనున్న అబుదాబి మైదానంలో హైదరాబాద్ గతంలో మూడు మ్యాచులాడి ఒకదాంట్లో మాత్రమే గెలిచింది. రెండింట్లో ఓటమిపాలైంది. మరోవైపు కోల్కతా ఈ వేదికపై ఎనిమిది మ్యాచ్లాడింది. అందులో నాలుగు విజయాలు, నాలుగు ఓటములు నమోదు చేసింది.
అర్థంకాని అబుదాబి పిచ్..
అబుదాబి మైదానంలో సీజన్ ప్రారంభంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు విజయావకాశాలు ఎక్కువ ఉండేవి. తర్వాత పరిస్థితి తారుమారైంది. ఛేదన జట్లు గెలవడం ప్రారంభించాయి. పిచ్ పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందో తెలియని ఈ మైదానంలో టాస్ గెలిచిన జట్టు ఏం తీసుకుంటుందన్నదీ కీలకమే.
జట్లు (అంచనా)
హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), బెయిర్స్టో, మనీశ్ పాండే, విలియమ్సన్, విజయ్ శంకర్, అభిషేక్శర్మ/విరాట్ సింగ్, రషీద్ఖాన్, షాబాజ్ నదీమ్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, నటరాజన్.
కోల్కతా: రాహుల్ త్రిపాఠి, శుభ్మన్ గిల్, నితీశ్ రాణా, మోర్గాన్(కెప్టెన్), దినేశ్ కార్తిక్, రసెల్, క్రిస్ గ్రీన్/ఫెర్గుసన్, కమిన్స్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!