మాక్సీ ఖరీదైన ఓ చీర్లీడర్: సెహ్వాగ్
దిగ్విజయంగా ముసిగిన టీ20 లీగ్లో జట్లు, ఆటగాళ్ల ప్రదర్శనలపై మాజీలు, విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ లీగ్లో విఫలమైన అయిదుగురు ఆటగాళ్ల గురించి మాట్లాడాడు.
లీగ్లో విఫలమైన ఆటగాళ్లు గురించి వ్యాఖ్యలు
ఇంటర్నెట్డెస్క్: దిగ్విజయంగా ముగిసిన టీ20 లీగ్లో జట్లు, ఆటగాళ్ల ప్రదర్శనలపై మాజీలు, విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ లీగ్లో విఫలమైన అయిదుగురు ఆటగాళ్ల గురించి మాట్లాడాడు. ‘వీరూకి బై తక్’ కార్యక్రమంలో తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు విసిరాడు. ఆరోన్ ఫించ్, రసెల్, మాక్స్వెల్, షేల్ వాట్సన్, డేల్ స్టెయిన్ గురించి సెహ్వాగ్ ఏమన్నాడో ఆయన మాటల్లో చదివేయండి.
‘‘ఆరోన్ ఫించ్... కోహ్లీసేనలో అతడు వీరూ అవుతాడని నా ముద్దుపేరుని అతడికిచ్చాను. కానీ బెంగళూరుకు ఉన్న శాపం అతడిపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఈ సీజన్లో అతడి బ్యాటింగ్ ఇంజిన్ పనిచేయలేదు’’
‘‘ఆండ్రూ రసెల్.. కండల వీరుడు ఈ సీజన్లో సోమరిగా ఉన్నాడు. చెలరేగుతానని మనకి హామీలు ఇచ్చి నిద్రపోయాడు. అందుకే కోల్కతా ప్లేఆఫ్కు చేరలేదు’’
‘‘షేన్ వాట్సన్.. ఈ డిజిల్ ఇంజిన్పై చెన్నై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్నో కిక్స్టార్ట్ల తర్వాత ఈ సీజన్లో ఇంజిన్ పనిచేయడం ప్రారంభించింది. అయితే తన వాహనాన్ని ఇకపై లాగలేనని సీజన్ ముగిశాక రిటైర్మెంట్ ప్రకటించాడు’’
‘‘గ్లెన్ మాక్స్వెల్.. పంజాబ్ జట్టులో రూ.10 కోట్ల ఖరీదైన చీర్లీడర్. లీగ్లో గత కొన్ని సీజన్లుగా తన ప్రదర్శన పేలవంగా కొనసాగుతోంది. అయితే ఈ సారి ఆ రికార్డులు కూడా బద్దలు కొట్టి మరింత విఫలమయ్యాడు. ఇది అతడికి అత్యంత ఖరీదైన విహారయాత్రగా భావించవచ్చు’’
‘‘డేల్ స్టెయిన్.. ఒకప్పుడు ‘స్టెయిన్ గన్’లో నుంచి వచ్చే బుల్లెట్లను చూసి అందరూ భయపడేవారు. కానీ ఈ సీజన్లో స్టెయిన్ గన్.. బొమ్మ గన్గా మారింది. అతడి ప్రదర్శన చూసి నా కళ్లను నేనే నమ్మలేకపోయా. కానీ ఓ విషయంపై స్పష్టత వచ్చింది. భవిష్యత్లో లీగ్ మార్కెట్లో అతడిని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రారు’’ అని సెహ్వాగ్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్