Tennis News: రోజర్ ఫెదరర్లా వీడ్కోలు మ్యాచ్ ఆడేందుకు అర్హుడిని కాను: ఆండీ ముర్రే
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఇటీవలే ప్రొఫెషనల్ టెన్నిస్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. లావెర్ కప్లో చివరిసారిగా రోజర్తో కలిసి...
ఇంటర్నెట్ డెస్క్: స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఇటీవలే ప్రొఫెషనల్ టెన్నిస్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. లావెర్ కప్లో చివరిసారిగా రోజర్తో కలిసి స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ బరిలోకి దిగాడు. అయితే సోక్, టియాఫో జోడీ చేతిలో 6-4, 6(2)-7, 9-11 తేడాతో ‘ఫెదల్’ జోడీ ఓడింది. అయితే కెరీర్లో ఆఖరిగా ప్రొఫెషనల్ టెన్నిస్ మ్యాచ్ ఆడిన తర్వాత ఫెదరర్, రఫేల్ సహా టెన్నిస్ అభిమానులు కన్నీళ్లు పెట్టుకొన్నారు. ఈ క్రమంలో బ్రిటన్ టెన్నిస్ ఆటగాడు ఆండీ ముర్రే కూడా ‘భవిష్యత్తు మరింత ఆనందంగా ఉండాలని’ ఆకాంక్షిస్తూ ఫెదరర్కు శుభాకాంక్షలు చెప్పాడు.
రోజర్కు ప్రొఫెషనల్గా చివరి మ్యాచ్ కావడంతో రఫేల్ నాదల్తో కలిసి బరిలోకి దిగడం విశేషం. అయితే ఇలాంటి అద్భుత వీడ్కోలు మ్యాచ్ ఆడేందుకు తనకు అర్హత లేదని ఆండీ ముర్రే పేర్కొన్నాడు. ఫెదరర్ చివరి మ్యాచ్ను చూడటమే ప్రత్యేకమని తెలిపాడు. ‘‘రిటైర్మెంట్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు.. అయితే నేను వీడ్కోలు పలికేటప్పుడు ఇలాంటి స్పెషల్ మ్యాచ్కు అర్హత లేదని మాత్రం తెలుసు. దీనికి రోజర్ మాత్రమే అర్హుడు. అయితే ఇలా దిగ్గజం చివరి మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించడమే ప్రత్యేకతను సాధించినట్లు. నేను కూడా తప్పకుండా రిటైర్మెంట్ గురించి ప్రకటిస్తా. కానీ ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేను. ఇప్పటికీ కాంపిటేటివ్ టెన్నిస్ ఆడతా. శారీరకంగానూ బాగానే ఉన్నా. అయితే విజయం వరకు వచ్చి ఆఖర్లో ఓడిపోతున్న సందర్భాల నుంచి బయటపడాలి’’ అని ఆండీ ముర్రే తెలిపాడు. లావెర్ కప్లో ఆండీ ముర్రే 7-5, 3-6, 7-10 తేడాతో అలెక్స్ డి మినౌర్ చేతిలో ఓడిపోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.