Cricket News : కరోనా కారణంగా తగ్గిపోతున్న ‘క్రికెట్’ చిన్నారులు..!
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి దెబ్బకు అనేక రంగాలు కుదేలయ్యాయి. కోట్ల మంది జీవితాలపై తీవ్ర ప్రభావం..
ఆందోళనలో ఆస్ట్రేలియన్ క్రికెట్
(ఫొటో సోర్స్: ఆస్ట్రేలియన్ క్రికెట్ ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి దెబ్బకు అనేక రంగాలు కుదేలయ్యాయి. కోట్ల మంది జీవితాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇక క్రికెట్ మీద కూడానూ ఎఫెక్ట్ చూపింది. మ్యాచ్ల నిర్వహణ సంగతి పక్కనపెడితే.. ఆటను తమ కెరీర్గా ఎంచుకునే వారి సంఖ్య తగ్గిపోయిందని ఆస్ట్రేలియన్ క్రికెట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొవిడ్తో ‘ఒక తరం’ చేజారిపోతోందని ఆస్ట్రేలియన్ క్రికెట్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కరోనావైరస్ మహమ్మారి కారణంగా గత సీజన్లో జూనియర్ ప్రోగ్రామ్స్లో మొదటిసారి పాల్గొనే చిన్నారుల సంఖ్య 15,000కు పడిపోయిందని ఆస్ట్రేలియన్ క్రికెట్ తెలిపింది. లాక్డౌన్స్ తర్వాత క్లబ్ ప్లేయర్స్ అధికంగానే తిరిగి వస్తున్నారని, అయితే 12 ఏళ్లలోపు చిన్నారుల రాక మాత్రం తగ్గిపోయారని ఆందోళన వ్యక్తం చేసింది.
‘‘5-12 ఏళ్ల చిన్నారులు అధికంగా క్రికెట్ను ఎంచుకునేలా చేయడమే ఆస్ట్రేలియన్ క్రికెట్ వ్యూహం. క్రికెట్ అనేది చాలా కఠినమైన గేమ్. అందుకే చిన్న వయస్సులోనే వారిలో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. 12 సంవత్సరాల లోపు క్రికెట్కు సంబంధించిన అంశాలను నేర్చుకోకపోతే.. టీనేజీ, కాస్త పెద్దయ్యాక క్రికెట్ ఆడాలనే ఆసక్తి సన్నగిల్లే అవకాశం ఉందని మా సర్వేలో తేలింది. అందుకోసం మేం కొన్ని ప్రణాళికలను తయారు చేస్తున్నాం. చిన్నారులను క్రికెట్ వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాం. లేకపోతే కొత్తగా వచ్చే తరాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఒక సంవత్సరం మిస్ అయిపోయాం. రాబోయే 12 నెలల్లో సమస్యకు పరిష్కారం కనుగొంటాం’’ అని ఆస్ట్రేలియన్ క్రికెట్ కమ్యూనిటీ క్రికెట్ హెడ్ జేమ్స్ అలాసోప్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్