HCA: ‘హెచ్సీఏలో అవినీతి రాజ్యమేలుతోంది.. త్వరలో అజహర్కు బుద్ధిచెబుతాం’
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ప్రస్తుతం అవినీతి రాజ్యమేలుతోందని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు...
అధ్యక్షుడిపై హైదరాబాద్ మాజీ ఆఫీస్ బేరర్ల మండిపాటు
(Photo: Mohammed Azharuddin Twitter)
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ప్రస్తుతం అవినీతి రాజ్యమేలుతోందని మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధ్యక్షుడు అజహరుద్దీన్తో పాటు ఇతర సభ్యుల పనితీరు అవినీతిమయమైందని ఆరోపించారు. శివలాల్తో పాటు హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ ఆయుబ్, మాజీ కార్యదర్శి శేష్ నారాయణ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత హెచ్సీఏ కార్యవర్గంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు హెచ్సీఏలో సమస్యలు పేరుకుపోయాయని, చర్చించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయన్నారు. అజహర్ వ్యవహారశైలితో యువ ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధ్యక్షుడి అనాలోచితమైన నిర్ణయాల వల్ల క్రికెటర్లపై పెను ప్రభావం పడుతోందని వారు విమర్శలు చేశారు.
అజహర్ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు..
‘హెచ్సీఏలో ప్రస్తుత అధ్యక్షుడు తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు. బెదిరింపులకు పాల్పడుతున్నారు. అపెక్స్ కౌన్సిల్ నియమాలను ఉల్లంఘిస్తూ.. అన్ని విభాగాల నిబంధనలను కూడా పాటించడంలో మార్గనిర్దేశం చేయడం లేదు. సీనియర్ సెలక్షన్ కమిటీ, క్రికెట్ సలహా కమిటీలను అజహరుద్దీన్ రద్దు చేసి.. తన సొంత సెలక్షన్ కమిటీని నియమించారు. నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తున్నారు. అలాగే నాలుగు లీగ్ జట్లను నిలిపివేశారు. ఆయన మాట వినని క్లబ్లను రద్దు చేస్తున్నారు. ఆయా క్లబ్ల నిర్వహణ వెనుక చాలా చరిత్ర ఉంది. అలాంటి వాటిని నిలిపివేసి.. ఆయనపై ఆధారపడిన, ఆయనకే చెందిన క్లబ్బులను మాత్రమే క్రికెట్ ఆడిస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి లీగ్లు, మ్యాచ్లు నిర్వహించడం లేదు. మరోవైపు హైదరాబాద్లో భారత టీ20 లీగ్తో పాటు, రంజీ, ముస్తాక్ అలీ, అంతర్జాతీయ మ్యాచ్లు కానీ ఏవీ జరగడం లేదు. క్రికెట్ను మరిచిపోయే విధంగా అజహర్ ప్రస్తుత హెచ్సీఏను తయారు చేశారు. ఆయన వచ్చాకే ఇక్కడ పోలీస్ కేసులు నమోదయ్యాయి. సెలక్షన్ కమిటీ అంటే డబ్బులకు మాత్రమే ఉంది. నైపుణ్యమున్న ఆటగాళ్లకు ప్రాధాన్యత లేదు. త్వరలోనే అజహర్ నేతృత్వంలోని హెచ్సీఏ కార్యవర్గ సమయం ముగియనుంది. సెప్టెంబర్లో హెచ్సీఏ ఎన్నికలు నిర్వహించమని బిసీసీఐ సుప్రీంకోర్టును అశ్రయించనుంది. భవిష్యత్లో హైదరాబాద్ క్రికెట్కు మంచి రోజులు రావాలని ఆశిస్తున్నాం’ అని హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయుబ్ పేర్కొన్నారు.
త్వరలోనే అతనికి బుద్ది చెబుతాం..
‘అజహర్ సుప్రీంకోర్టు గైడ్లైన్ను ఉల్లంఘిస్తున్నారు. దాని ప్రకారం చెక్లపై సంతకాలు చేయలేదు. నిధులు ఇంకా విడుదల కాలేదు. ఆఫీస్ బేరర్స్ మాట వినడం లేదు. రూ.16 కోట్లు వచ్చినా హెచ్సీఏ దుర్వినియోగం చేస్తోంది. మూడు సంవత్సరాల అకౌంట్స్ ఇంకా లెక్క చూపలేదు.వచ్చే హెచ్సీఏ ఎన్నికల్లో అజహర్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన రోజు నుంచి అన్నీ వివాదాలే నెలకొన్నాయి. హైదరాబాద్లో అజహర్ ఎన్ని రోజులు ఉన్నారు? ఎన్నిసార్లు సెక్రెటరీల సమావేశం పెట్టారు? బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒక జట్టు ఎంపికలో 20 మందికి మించరాదు. కానీ, ఆయన 35 మందిని ఎంపిక చేశారు. ఆయన హైదరాబాద్లో కన్నా దుబాయ్లోనే ఎక్కువగా ఉంటున్నారు. మాజీ ఆఫీస్ బేరర్లు అందరం కలిసి అజహర్కు వచ్చే హెచ్సీఏ ఎన్నికల్లో బుద్ధి చెబుతాం’ అని హెచ్సీఏ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్