BAN vs NZ: న్యూజిలాండ్ విజయలక్ష్యం 246
న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 245 పరుగులు చేసింది.
ఇంటర్నెట్డెస్క్: వన్డే ప్రపంచకప్లో భాగంగా చెన్నై వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (66; 75 బంతుల్లో 6×4,2×6) అర్ధ శతకంతో రాణించగా.. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (40), హసన్ మిరాజ్ (30) ఫర్వాలేదనిపించారు. మిగతావారెవరూ పెద్దగా రాణించలేదు. చివర్లో మహ్మదుల్లా (41*) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో బంగ్లా మంచి స్కోరే చేసింది.
బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ లిట్టన్ దాస్ డకౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే మత్ హెన్రీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలిడౌన్లో వచ్చిన హసన్ మిరాజ్తో కలిసి, మరో ఓపెనర్ తన్జిద్ హసన్ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. అయితే, జట్టు స్కోరు 40 పరుగుల వద్ద ఫెర్గూసన్ బౌలింగ్లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి హసన్ పెవిలియన్ బాట పట్టాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే మిరాజ్ కూడా ఫెర్గూసన్ బౌలింగ్లోనే హెన్రీ చేతికి చిక్కాడు. దీంతో జట్టు ఒక్కసారిగా కష్టాల్లోకి పడింది.
కెప్టెన్ షకీబ్ అల్ హసన్, రహీమ్ ఆచితూచి ఆడుతూ.. ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. జోరు పెంచిన ఈ జోడీని ఫెర్గూసన్ విడగొట్టాడు. జట్టు స్కోరు 152 పరుగుల వద్ద కాన్వేకు క్యాచ్ ఇచ్చి షకీబ్ అల్ హసన్ పెవిలియన్కు చేరాడు. కొద్దిసేపటికే 66 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హెన్రీ బౌలింగ్లో రహీమ్ వెనుదిరిగాడు. చివర్లో మహ్మదుల్లా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో బంగ్లా మంచి స్కోరు చేసినట్లయింది. కివీస్ బౌలర్లలో ఫెర్గుసన్ 3 వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, మత్ హెన్రీ చెరో 2 వికెట్లు, మిచెల్ శాట్నర్, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్