రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
కిగాలి: ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది. అండర్-18 డబుల్స్ తుది పోరులో షన్విత-లారా చానోవా (చెక్) జంట 3-6, 1-6తో సెల్లా జిమోవిచ్ (సెర్బియా)-నేహా కృష్ణన్ (అమెరికా) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. సెమీస్లో షన్విత ద్వయం 6-2, 6-3తో సిల్వియా కాలిమన్ (స్పెయిన్)-కరీనా వోజ్నియాక్ (పోలెండ్) జంటపై గెలిచింది. పటాన్చెరుకు చెందిన షన్విత.. విజయ్ టెన్నిస్ అకాడమీలో శిక్షణ పొందుతోంది.
ప్రపంచకప్ జట్టు ఎంపిక ఆలస్యం
దిల్లీ: టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ప్రకటన ఆలస్యం కానుంది. శనివారం కెప్టెన్ రోహిత్ శర్మ దిల్లీలో ఐపీఎల్ మ్యాచ్ ఆడగా.. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ కూడా ఆ నగరంలోనే ఉన్నాడు. ఇదే రోజు సెలక్షన్ కమిటీ సమావేశం జరుగుతుందని.. అందులో రోహిత్తో పాటు కోచ్ ద్రవిడ్ కూడా పాల్గొంటాడని.. జట్టును కూడా ప్రకటిస్తారని వార్తలొచ్చాయి. కానీ జట్టు ఎంపికకు ఇంకా సమయం పడుతుందని.. తుది గడువు అయిన మే 1లోపు ఎప్పుడైనా జట్టును ప్రకటించవచ్చని తెలిసింది. ఐపీఎల్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనను మరింతగా పరిశీలించేందుకే సెలక్టర్లు సమయం తీసుకుంటున్నట్లు సమాచారం. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ జూన్ 2న ఆరంభమవుతుంది.
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ నిర్వహించాలంటే..
దిల్లీ: భారత యువ సంచలనం గుకేశ్, డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ మధ్య ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ నిర్వహించాలని ఆశిస్తున్న భారత్ అందుకోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫిడె ఈ విషయం వెల్లడిస్తూ.. ఈవెంట్ నిర్వహణకు బిడ్లు ఆహ్వానించింది. టోర్నీ బడ్జెట్ కింద సుమారు రూ.71 కోట్లు ఖర్చయితే.. నిర్వహణ వ్యయం పేరిట ఫిడేకు రూ.9 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. గుకేశ్-డింగ్ లిరెన్ మధ్య ఈ 14 మ్యాచ్ల ఈ సమరం నవంబర్ 20-డిసెంబర్ 15 మధ్య జరిగే అవకాశం ఉంది. విజేతకు ప్రైజ్మనీగా రూ.20 కోట్లు దక్కుతాయి. 2023తో పోలిస్తే మూడు కోట్లు ఎక్కువ. గుకేశ్-లిరెన్ మధ్య ప్రపంచ చెస్ టైటిల్ పోరుకు ఆతిథ్యమిచ్చేందుకు బిడ్ దాఖలు చేస్తామని అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) కొత్త కార్యదర్శి దేవ్ పటేల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్కు ఆతిథ్య హక్కులు దక్కితే.. నిరుడు చెస్ ప్రపంచకప్ జరిగిన గుకేశ్ సొంత నగరం చెన్నైలోనే ఈ ఈవెంట్ను కూడా నిర్వహించే అవకాశాలున్నాయి.
భారత్కు మరో 5 పతకాలు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్
దిల్లీ: ఆసియా అండర్-20 అథ్లెటిక్స్లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. శనివారం ఈ పోటీల్లో భారత్కు మరో అయిదు పతకాలు దక్కాయి. మహిళల 5 వేల మీట ట్రాక్ రేసులో ఏక్తా డే (16:49.70 సె) రజతం నెగ్గగా.. సునీతా దేవి (16:52.54 సె) కాంస్యం సాధించింది. పురుషుల 3 వేల మీటర్ల పరుగులో గౌరవ్ భాస్కర్ (8:31.20 సె) రజతం, వికాస్ (8:33.00 సె) కాంస్యం గెలిచారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో ఉన్నతి అయ్యప్ప (13.65 సె) కాంస్యం సాధించింది.
ఆర్యన్, జితేశ్ విజయాలు
అస్తానా (కజకిస్థాన్): ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారులు ఆర్యన్, జితేశ్ శుభారంభం చేశారు. శనివారం ఆరంభమైన టోర్నీలో ఆర్యన్ 51 కేజీల విభాగంలో 5-0తో జో హైయాన్ (దక్షిణ కొరియా)ను చిత్తు చేశాడు. జితేశ్ సైతం 5-0తోనే చెన్ యు (చైనీస్ తైపీ)ని మట్టికరిపించాడు. మిగతా భారత బాక్సర్లు ఆదివారం తమ తొలి బౌట్ ఆడతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
166.. 58 బంతుల్లో ఉఫ్
47 నిమిషాలు.. 58 బంతులు.. 167 పరుగులు.. 0 వికెట్లు! బుధవారం ఉప్పల్ స్టేడియంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసమిది. ఇన్నింగ్స్ విరామంలో అభిమానులు స్నాక్స్ తెచ్చుకునేలోపే.. టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్ తీసుకునేలోపే సన్రైజర్స్ లక్ష్య ఛేదన పూర్తయింది. -
ముంబయి తప్ప..
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్నవూపై సన్రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సంగీతం వింటూ.. సిరీస్లు చూస్తూ
ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. -
మూడేళ్లలో తొలిసారి..
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్ కప్లో అతడు ఆడనున్నాడు. -
ఓడలో ఫ్రాన్స్కు ఒలింపిక్ జ్యోతి
1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది. -
నా రికార్డులను జైస్వాల్ బద్దలు కొడతాడు
టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా కొనియాడాడు. -
శాంసన్.. మాస్టర్ బ్లాస్టర్!
ఈ ఐపీఎల్లో భీకర ఫామ్తో సాగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్బ్లాస్టర్గా అభివర్ణించాడు. -
అమన్పై ఆశలు
ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లలో అమన్ శెరావత్, దీపక్ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి. -
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్