IND vs NZ: కివీస్‌ను ఆ ఇద్దరే నిలబెట్టారు.. టీమ్‌ఇండియా లక్ష్యం ఎంతంటే?

రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా, రోహిత్ శర్మ సారథ్యంలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీమ్‌ఇండియా సిరీస్‌ వేటను ప్రారంభించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా...

Updated : 17 Nov 2021 20:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా, రోహిత్ శర్మ సారథ్యంలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీమ్‌ఇండియా సిరీస్‌ వేటను ప్రారంభించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ భారీ స్కోరు చేయకుండా భారత బౌలర్లు కట్టడి చేశారు. టాస్‌ నెగ్గిన టీమ్‌ఇండియా బౌలింగ్‌ ఎంచుకుని కివీస్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 

తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్‌ డారిల్‌ మిచెల్‌ (0)ను భువనేశ్వర్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన మార్క్‌ చాప్‌మన్‌ (63: ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు)తో కలిసి మరో ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ (70: మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ కలిసి శతక (109) భాగస్వామ్యం నిర్మించారు. అయితే, వెంటవెంటనే చాప్‌మన్‌తోపాటు ఫిలిప్స్‌ (0) పెవిలియన్‌కు చేరాడు. ఈ రెండు వికెట్లను అశ్విన్‌ పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సీఫర్ట్‌ (12)తో కలిసి గప్తిల్‌ ధాటిగా ఆడాడు. మళ్లీ గప్తిల్‌, సీఫర్ట్‌ స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో కివీస్‌ స్కోరు బోర్డు వేగం తగ్గిపోయింది. కివీస్‌ బ్యాటర్లలో రచిన్‌ రవింద్ర 7, సాట్నర్ 4* పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్‌ 2, భువనేశ్వర్‌ 2.. చాహర్, సిరాజ్‌ చెరో వికెట్‌ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని