భారత అభిమానులు.. బాధపడకండి!
నాలుగు టెస్టుల సిరీస్లో భారత్కు ఊహించని ఆరంభం దక్కింది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో 227 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పర్యాటక జట్టు...
ఇంటర్నెట్డెస్క్: నాలుగు టెస్టుల సిరీస్లో భారత్కు ఊహించని ఆరంభం దక్కింది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో 227 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పర్యాటక జట్టు మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం చెలాయించింది. అయితే టీమిండియా అభిమానులు ఫలితంపై నిరాశ చెందాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అంటున్నాడు. గత సిరీస్ల్లో తొలి మ్యాచ్ కోల్పోయినా భారత్ సిరీస్ సాధించిందని గుర్తు చేస్తున్నాడు. భారత్×ఇంగ్లాండ్ టెస్టుపై మాజీ క్రికెటర్లు ఏమన్నారంటే...
‘‘భారత అభిమానులు బాధపడకండి. గత సిరీస్లో తొలి టెస్టు ఓటమిపాలైనప్పటికీ సిరీస్ మనమే గెలిచాం (ఆస్ట్రేలియా పర్యటన గురించి). అయితే భారత్లో భారత్ను సుదీర్ఘ ఫార్మాట్లో ఓడించడం అంత సులువు కాదు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు గొప్పగా రాణించారు. వాళ్లకి అభినందనలు. ఈ టెస్టు ఇంగ్లాండ్ గొప్ప విజయాల్లో ఒకటిగా నిలుస్తుంది’’ - వసీమ్ జాఫర్
‘‘అండర్సన్ ఎప్పటికీ మా అత్యుత్తమ బౌలర్. ఇంగ్లాండ్కు శుభాకాంక్షలు. సంపూర్ణ విజయమిది - నాసర్ హుస్సేన్
‘‘అద్భుత ప్రదర్శనతో భారత్లో భారత్ను ఓడించారు. 227 పరుగుల తేడాతో విజయం. ఇంగ్లాండ్ జట్టు ఈ ఏడాది ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. సారథిగా 26వ టెస్టు విజయాన్ని అందుకున్న జో రూట్కు శుభాకాంక్షలు’’ - మైకేల్ వాన్
‘‘గొప్ప విజయం సాధించిన ఇంగ్లాండ్కు అభినందనలు. సీనియర్ ఆటగాళ్లు రూట్, అండర్సన్ ముందుండి జట్టు బాధ్యతల్ని చక్కగా మోశారు. సిరీస్లో మిగిలిన మ్యాచ్లు రాణించడానికి ఆత్మ విశ్వాసాన్ని పెంచుకున్నారు’’ - వీవీఎస్ లక్ష్మణ్
‘‘ఇంగ్లాండ్ గొప్పగా ఆడింది. గత మూడేళ్లలో స్వదేశంలో భారత్కు ఎదురైన బలమైన అభ్యర్థి ఇంగ్లాండ్’’ - హర్షా భోగ్లే
‘‘ఆస్ట్రేలియా సిరీస్ విజయం సాధించినప్పుడే హెచ్చరించా. భారత్ ఎక్కువగా సంబరాలు చేసుకోవద్దని’’ - కెవిన్ పీటర్సన్
‘‘టాస్ అనేది కీలకమే. కానీ ఓటమికి అదే కారణం కాదు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో చివరి మూడు మ్యాచ్ల్లో టాస్ ఓడాం. అయినా రెండు టెస్టుల్లో విజయం సాధించాం. మరో టెస్టును డ్రాగా ముగించాం. అయితే ఇప్పుడు సిరీస్ స్వదేశంలో జరుగుతోంది. తొలి రెండు రోజుల్లో ఉన్నట్లుగా పిచ్ ఫ్లాట్, స్లోగా లేదు. ఇది భారత కఠినమైన పిచ్. కాగా, తొలి టెస్టులో ఇంగ్లాండ్ గొప్ప విజయం సాధించింది. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసును ఆసక్తికరంగా మార్చింది’’ - ఆకాశ్ చోప్రా
‘‘ఇంగ్లాండ్కు అభినందనలు. భారత్లో భారత్ను ఓడించడం అంత ఈజీ కాదు. ప్రత్యేకంగా ప్రస్తుత టీమిండియాని. అయితే ఇంకా మూడు మ్యాచ్లున్నాయి. జాగ్రత్తగా ఉండండి. టీమిండియా నుంచి గొప్ప పోరాటాన్ని ఆశిస్తున్నాం’’ - ఆర్పీ సింగ్
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM