డోపింగ్కు పాల్పడలేదు
తాను డోపింగ్కు పాల్పడలేదని.. ఉద్దేశపూర్వకంగా ఎలాంటి ఉత్ప్రేరకాన్ని తీసుకోలేదని భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ చెప్పింది.
ఆ ఉత్ప్రేరకం ఎలా వచ్చిందో తెలియదు
దిల్లీ: తాను డోపింగ్కు పాల్పడలేదని.. ఉద్దేశపూర్వకంగా ఎలాంటి ఉత్ప్రేరకాన్ని తీసుకోలేదని భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ చెప్పింది. తనపై 21 నెలల నిషేధం పడిన నేపథ్యంలో ఆమె ఇలా పేర్కొంది. ‘‘నిషేధిత ఉత్రేరకాన్ని తీసుకోవాలనే ఆలోచనే ఎప్పుడూ రాలేదు. జిమ్నాస్టిక్సే నా లోకం. దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఏనాడూ ప్రవర్తించలేదు. 2017, 19ల్లో రెండు శస్త్ర చికిత్సలు చేయించుకున్నా. కోలుకుని మళ్లీ ఫ్లోర్ మీదకు రావాలని అనుకున్నా. ఫిట్నెస్పై దృష్టి పెట్టా. కానీ ఇంతలోనే ఈ షాక్. నాపై సస్పెన్షన్ 2021 అక్టోబర్ 11 నుంచి అమల్లోకి రావడం కొంచెం ఉపశమనాన్ని ఇస్తోంది. కేసు త్వరగా పరిష్కారం కావడం కోసమే సస్పెన్షన్ను అంగీకరించా’’ అని దీప చెప్పింది. తన శరీరంలోకి నిషేధిత ఉత్ప్రేరకాలు ఎలా వచ్చాయో దీపకు తెలియదని.. ఒకవేళ ఆమె ఉద్దేశపూర్వకంగా ఇలా చేసుంటే నాలుగేళ్ల నిషేధం ఎదుర్కొనేదని ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నంది అన్నాడు. త్వరలోనే ఆమె మళ్లీ ఫ్లోర్ మీదకు వస్తుందని చెప్పాడు. డోప్ పరీక్షలో విఫలం కావడంతో అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ సమాఖ్య (ఎఫ్ఐజీ) నిబంధనలను అనుసరించి అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) దీపకు శిక్ష విధించింది. తొలిసారి శాంపిల్ తీసుకున్న 2021 అక్టోబర్ 11 నుంచి అమల్లోకి రానున్న ఈ నిషేధం ఈ ఏడాది జులై 10న పూర్తి కానుంది. ‘‘2021లో దీప నుంచి సేకరించిన శాంపిల్లో హైజెన్మైన్ అనే నిషేధిత ఉత్ప్రేరకం బయటపడింది. దీంతో అప్పటి నుంచి ఆమె పోటీపడిన అన్ని టోర్నీల ఫలితాలపై అనర్హత వేటు పడింది’’ అని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ ఆధ్వర్యంలో పని చేసే ఐటీఏ వెల్లడించింది. 2016 రియో ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం కోల్పోయిన దీప.. ఆ తర్వాత 2017లో గాయంతో ఆటకు దూరమైంది. మోకాలి శస్త్ర చికిత్స తర్వాత పునరాగమనంలోనూ పెద్దగా రాణించలేదు. టోక్యో ఒలింపిక్స్కూ దూరమైంది. 2019 బాకూలో జరిగిన ప్రపంచకప్ ఆమె చివరి అంతర్జాతీయ టోర్నీ. గతేడాది ఫిబ్రవరి నుంచి ప్రపంచ జిమ్నాస్టిక్స్ సమాఖ్య దీప పేరును ‘సస్పెండ్’ విభాగంలో చేర్చింది. ఆమెపై సస్పెన్షన్ విధించినట్లు ప్రపంచ సమాఖ్య నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని అప్పట్లో భారత జిమ్నాస్టిక్స్ సంఘం అధ్యక్షుడు సుధీర్ మిత్తల్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు