Virat Kohli: అలా నిరూపించాల్సిన స్థితిలో లేను: కోహ్లీ
బయటకు వెళ్లి ఒకరిని తప్పు అని నిరూపించాల్సిన స్థితిలో లేనని టీమ్ఇండియా అగ్రశ్రేణి బ్యాటర్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు.
అహ్మదాబాద్: బయటకు వెళ్లి ఒకరిని తప్పు అని నిరూపించాల్సిన స్థితిలో లేనని టీమ్ఇండియా అగ్రశ్రేణి బ్యాటర్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 186 పరుగులు చేసిన అతను.. మూడేళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో తిరిగి సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
‘‘ఓ ఆటగాడిగా నాపై నాకున్న అంచనాలే నాకెంతో ముఖ్యం. ఇప్పుడు బయటకు వెళ్లి ఒకరిని తప్పని నిరూపించాల్సిన స్థితిలో లేను. మైదానంలో ఉన్నందుకు తగిన న్యాయం చేయాలి. టెస్టు క్రికెట్లో గత పదేళ్లుగా ఆడినట్లు ఇటీవల కాలంలో ఆడలేకపోయా. తిరిగి ఆ ఆటతీరును ప్రదర్శించేందుకే ప్రయత్నించా. ఆస్ట్రేలియాతో సిరీస్లో నాగ్పూర్లో తొలి ఇన్నింగ్స్ నుంచి ఉత్తమంగానే బ్యాటింగ్ చేశాననుకుంటున్నా’’ అని సోమవారం ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన విరాట్ తెలిపాడు.
గాయంతో శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చే అవకాశం లేకపోవడంతో సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ కొనసాగించాలనుకున్నట్లు ఈ ఇన్నింగ్స్లో 364 బంతులు ఎదుర్కొన్న కోహ్లి చెప్పాడు. ‘‘గాయంతో శ్రేయస్ బ్యాటింగ్కు వచ్చే అవకాశం లేకపోవడంతో ఓ బ్యాటర్ తక్కువయ్యాడు. కాబట్టి ఎక్కువ సేపు ఆడడంపై దృష్టి పెట్టాం. వీలైనంత సేపు జట్టు కోసం క్రీజులో ఉండాలనుకున్నాం. నేను ఆ పనే చేశా. కానీ గతంలో లాగా పూర్తి సామర్థ్యం మేరకు ఆడలేకపోయా. ఆ విధంగా చూస్తే నిరాశ కలుగుతోంది. కానీ ఉత్తమంగానే ఆడుతున్నాననే నమ్మకమూ వచ్చింది’’ అని కోహ్లి తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి