Chennai Super Kings: ప్లేఆఫ్స్ దిశగా..
పిచ్ కఠినంగా ఉంది. పరుగులు చేయడం కష్టమైంది. జట్టులో ఒక్కరూ కనీసం 30 పరుగులు చేయలేదు. అలాంటి పిచ్ మీదా 167 పరుగులు చేసింది చెన్నై.
చెన్నై ఖాతాలో ఏడో విజయం
ఏడో ఓటమితో దిల్లీ అవకాశాలు సంక్లిష్టం
పిచ్ కఠినంగా ఉంది. పరుగులు చేయడం కష్టమైంది. జట్టులో ఒక్కరూ కనీసం 30 పరుగులు చేయలేదు. అలాంటి పిచ్ మీదా 167 పరుగులు చేసింది చెన్నై. గత మ్యాచ్లో 182 పరుగుల లక్ష్యాన్ని 20 బంతులుండగానే ఛేదించిన దిల్లీని 140/8కే కట్టడి చేసి ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకున్న సూపర్కింగ్స్ ప్లేఆఫ్స్కు మరింత చేరువైంది. ఏడో ఓటమితో డీసీ.. ప్లేఆఫ్స్కు దాదాపుగా దూరం అయింది.
ఐపీఎల్-16లో చెన్నై సూపర్కింగ్స్ నిలకడను కొనసాగించింది. 12 మ్యాచ్ల్లో ఆ జట్టు ఏడో విజయం సాధించింది. బుధవారం సీఎస్కే 27 పరుగుల తేడాతో దిల్లీని ఓడించింది. బౌలర్ల ఆధిపత్యం సాగిన మ్యాచ్లో మొదట చెన్నై 8 వికెట్లకు 167 పరుగులు చేసింది. 25 పరుగులు చేసిన శివమ్ దూబెనే టాప్స్కోరర్. మిచెల్ మార్ష్ (3/18), అక్షర్ పటేల్ (2/27) చెన్నైని దెబ్బ తీశారు. అనంతరం పతిరన (3/37), దీపక్ చాహర్ (2/28), జడేజా (1/19)ల ధాటికి దిల్లీ 8 వికెట్లకు 140 పరుగులే చేయగలిగింది. రొసో (35; 37 బంతుల్లో 2×4, 1×6), మనీష్ పాండే (27; 29 బంతుల్లో 1×4, 2×6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.
దిల్లీ ఆపసోపాలు..: లక్ష్యం పెద్దది కాకపోయినా.. దిల్లీ ఏ దశలోనూ ఛేదన దిశగా సాగలేదు. ఇన్నింగ్స్ రెండో బంతికే వార్నర్ (0)ను ఔట్ చేసిన దీపక్ చాహర్.. తన తర్వాతి ఓవర్లో సాల్ట్ (17)ను పెవిలియన్ చేర్చాడు. మనీష్తో సమన్వయ లోపంతో మిచెల్ మార్ష్ రనౌటవడంతో 25/3తో దిల్లీ కష్టాల్లో పడింది. ఈ స్థితిలో రొసో, మనీష్ పాండే వికెట్ల పతనాన్ని అడ్డుకుని ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. కానీ పరుగుల వేగం పడిపోవడంతో సాధించాల్సిన రన్రేట్ పెరిపోయింది. మరీ నెమ్మదిగా ఆడుతున్న పాండే రెండు సిక్సర్లు బాది ఊపందుకున్నా.. ‘ఇంపాక్ట్ ప్లేయర్’ పతిరన అతణ్ని వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో దిల్లీ పతనానికి మళ్లీ గేట్లెత్తినట్లయింది. షాట్ల కోసం గట్టిగా ప్రయత్నించి విఫలమైన రొసో.. చివరికి జడేజా బౌలింగ్లో వెనుదిరిగాడు. అప్పటి 33 బంతుల్లో 89 పరుగులు చేయాల్సి రావడంతో దిల్లీ ఓటమి ఖరారైపోయింది. అక్షర్ (21), లలిత్ (12) ఓటమి అంతరాన్ని కాస్త తగ్గించారు.
ఆ రెండు ఓవర్లు మినహా..: మొదట చెన్నై ఇన్నింగ్స్లో రెండు ఓవర్లలో (14వ, 19వ) మాత్రమే మెరుపులు కనిపించాయి. మిగతా అంతా చెన్నై బ్యాటర్ల తడబాటే సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై.. బౌలర్లకు అనుకూలించిన పిచ్పై తడబడింది. దిల్లీ స్పిన్ త్రయం అక్షర్, కుల్దీప్, లలిత్.. చెన్నైని బాగా ఇబ్బంది పెట్టారు. ఈ ముగ్గురూ కలిపి 11 ఓవర్లు వేస్తే.. అందులో 89 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టారు. రుతురాజ్ (24) దూకుడుగా ఆడుతూ చెన్నైకి మంచి ఆరంభమే (4 ఓవర్లలో 32/0) ఇచ్చినా.. తడబడుతూ సాగిన కాన్వే (10)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ప్రత్యర్థిని తొలి దెబ్బ కొట్టాడు అక్షర్. కాసేపటికే రుతురాజ్ను సైతం అతనే ఔట్ చేశాడు. రహానె (20 బంతుల్లో 21) చాలాసేపు క్రీజులో ఉన్నా ధాటిగా ఆడలేకపోయాడు. అతణ్ని లలిత్ కళ్లు చెదిరే రిటర్న్ క్యాచ్తో ఔట్ చేశాడు. 13 ఓవర్లకు 84/4తో చెన్నై కష్టాల్లో పడింది. లలిత్ వేసిన 14వ ఓవర్లో దూబె (25; 12 బంతుల్లో 3×6) రెండు సిక్సర్లు బాదగా.. రాయుడు (23) ఒక్కో ఫోర్, సిక్సర్ బాదడంతో 23 పరుగులు వచ్చాయి. ఇన్నింగ్స్ గాడిన పడిందనుకుంటుండగా.. దూబె, రాయుడు ఔటైపోయారు. తర్వాత జడేజా (21), ధోని (20)ల పోరాటంతో స్కోరు 170కి చేరువైంది. ఖలీల్ వేసిన 19వ ఓవర్లో ధోని రెండు మెరుపు సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి.
చెన్నై ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) అమన్ (బి) అక్షర్ 24; కాన్వే ఎల్బీ (బి) అక్షర్ 10; రహానె (సి) అండ్ (బి) లలిత్ 21; మొయిన్ (సి) మార్ష్ (బి) కుల్దీప్ 7; దూబె (సి) వార్నర్ (బి) మార్ష్ 25; రాయుడు (సి) రిపల్ (బి) ఖలీల్ 23; జడేజా (సి) అక్షర్ (బి) మార్ష్ 21; ధోని (సి) వార్నర్ (బి) మార్ష్ 20; దీపక్ చాహర్ నాటౌట్ 1; తుషార్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 15 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 167; వికెట్ల పతనం: 1-32, 2-49, 3-64, 4-77, 5-113, 6-126, 7-164, 8-166; బౌలింగ్: ఖలీల్ 4-0-32-1; ఇషాంత్ 2-0-23-0; లలిత్ 3-0-34-1; అక్షర్ 4-0-27-2; కుల్దీప్ 4-0-28-1; మార్ష్ 3-0-18-3
దిల్లీ ఇన్నింగ్స్: వార్నర్ (సి) రహానె (బి) డి.చాహర్ 0; సాల్ట్ (సి) రాయుడు (బి) డి.చాహర్ 17; మార్ష్ రనౌట్ 5; పాండే ఎల్బీ (బి) పతిరన 27; రొసో (సి) పతిరన (బి) జడేజా 35; రిపల్ రనౌట్ 10; అక్షర్ (సి) రహానె (బి) పతిరన 21; అమన్ నాటౌట్ 2; లలిత్ (బి) పతిరన 12; కుల్దీప్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 140; వికెట్ల పతనం: 1-0, 2-20, 3-25, 4-84, 5-89, 6-116, 7-125, 8-140; బౌలింగ్: దీపక్ చాహర్ 3-0-28-2; తుషార్ 3-0-18-0; తీక్షణ 2-0-16-0, జడేజా 4-0-19-1; మొయిన్ 4-0-16-0; పతిరన 4-0-37-3
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి