బెంగాల్‌ జోరుకు కళ్లెం

ప్రొ కబడ్డీ లీగ్‌ ఎనిమిదో సీజన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బెంగాల్‌ వారియర్స్‌ జోరుకు యూపీ యోధ కళ్లెం వేసింది. శుక్రవారం మ్యాచ్‌లో ఆ జట్టు 40-36

Published : 22 Jan 2022 03:38 IST

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌ ఎనిమిదో సీజన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బెంగాల్‌ వారియర్స్‌ జోరుకు యూపీ యోధ కళ్లెం వేసింది. శుక్రవారం మ్యాచ్‌లో ఆ జట్టు 40-36 తేడాతో బెంగాల్‌పై గెలిచి హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. యూపీ తరపున పర్దీప్‌ నర్వాల్‌ (9), సురేందర్‌ గిల్‌ (9) రైడింగ్‌లో సత్తాచాటారు. బెంగాల్‌ కెప్టెన్‌ మణిందర్‌ సింగ్‌ (19) గొప్పగా పోరాడినా తన జట్టును గెలిపించలేకపోయాడు. అంతకుముందు మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 36-33తో దబంగ్‌ దిల్లీని ఓడించింది. హరియాణా సారథి వికాస్‌ (13) రైడింగ్‌లో సత్తాచాటి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. వినయ్‌ (7) కూడా రాణించాడు. దబంగ్‌ దిల్లీ తరపున సందీప్‌ నర్వాల్‌ (9) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని