ప్రపంచకప్ కోసం విదేశీ ఆటగాళ్లు
ఫుట్బాల్ ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన దిశగా ఘనా సన్నాహకాలు మొదలెట్టింది. ఈ ఏడాది నవంబర్ 21న ఖతార్లో ఆరంభమయ్యే ఈ టోర్నీ కోసం కొత్తగా అయిదుగురు....
జట్టులోకి తీసుకున్న ఘనా
అక్రా (ఘనా): ఫుట్బాల్ ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన దిశగా ఘనా సన్నాహకాలు మొదలెట్టింది. ఈ ఏడాది నవంబర్ 21న ఖతార్లో ఆరంభమయ్యే ఈ టోర్నీ కోసం కొత్తగా అయిదుగురు విదేశీ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. అండర్-21 విభాగంలో.. ఇంగ్లాండ్కు ఆడిన తరీఖ్ లాంప్టే, జర్మనీకి ప్రాతినిథ్యం వహించిన స్టీఫన్ ఆంబ్రోసియస్, రాన్స్ఫోర్డ్తో పాటు స్పెయిన్ తరపున ఓ స్నేహపూర్వక మ్యాచ్ ఆడిన విలియమ్స్, మరో జర్మనీ ఆటగాడు పాట్రిక్ ఫీఫర్ను ఘనా చేర్చుకుంది. ఈ ఆటగాళ్ల తమ దేశం తరపున ఆడేందుకు జాతీయత మార్చుకున్నారని ఘనా సాకర్ సమాఖ్య బుధవారం వెల్లడించింది. ఫిఫా నిబంధనల ప్రకారం తమ దేశం తరపున ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని ఆటగాళ్లు.. ఇలా ఇతర దేశాలకు ప్రాతినిథ్యం వహించొచ్చు. 2014 తర్వాత తొలిసారి, మొత్తంగా నాలుగో సారి ప్రపంచకప్కు అర్హత సాధించిన ఘనా.. పోర్చుగల్, దక్షిణ కొరియా, ఉరుగ్వేతో కలిసి గ్రూప్- హెచ్లో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!