NZ Vs IND: దంచేసిన సూర్య.. హడలెత్తించిన హుడా.. భారత్ చేతిలో కివీస్ చిత్తు
న్యూజిలాండ్ (Newzealand)తో ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్ (2nd T20 Match)లో టీమ్ఇండియా (Team India) 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మౌంట్ మాంగనుయ్: న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమ్ఇండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (111*: 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్లు) శతకంతో అదరగొట్టిన వేళ, కివిస్ ముందు భారత్ 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయడంతో... కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 61 (52) ఒంటరి పోరాటం వృథా అయింది. దీంతో మూడు టీ20ల సిరీస్లో భారత్ పైచేయి సాధించింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. నవంబర్ 22న (మంగళవారం) జరిగే చివరి మ్యాచ్లో టీమ్ఇండియా విజయం సాధిస్తే సిరీస్ను సొంతం చేసుకొంటుంది. ఒకవేళ ఓడినా సిరీస్ సమమవుతుంది.
భారీ లక్ష్యం.. విలియమ్సన్ ఒంటరి పోరాటం
భారత్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ ఆది నుంచి తడబడుతూనే ఆడింది. పరుగులేమీ చేయకుండానే ఫిన్ అలెన్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన విలియమ్సన్తో కలిసి కాన్వే కొద్దిసేపు భారత్ బౌలర్లకు చెమటలు పట్టించారు. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో అర్షదీప్కు క్యాచ్ ఇచ్చి కాన్వే (25) వెనుదిరిగాడు. ఆ తర్వాత కివిస్ను భారత్ బౌలర్లు కుదురుకోనీయలేదు. క్రమంగా వికెట్లు తీస్తూ వచ్చారు. మరోవైపు విలియమ్సన్ ఒంటరి పోరాటం చేసినా, మిగిలిన బ్యాటర్స్ నుంచి అతడికి సహకారం లభించలేదు. దీంతో కివిస్ 18.5 ఓవర్లకు 126 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో దీపక్ హుడా 4 వికెట్లు తీయగా, చాహల్, సిరాజ్ రెండేసి వికెట్లు తీశారు. భువనేశ్వర్, వాషింగ్టన్ సుందర్కు చెరో వికెట్ దక్కింది.
అంతకు ముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. సూర్య కుమార్ యాదవ్ శతకం (111*)తో అదరగొట్టడంతో టీమ్ ఇండియా భారీ స్కోరు చేసింది. సూర్య తన టీ20 కెరీర్లో రెండో శతకం బాదాడు. కేవలం 49 బంతుల్లో శతకాన్ని నమోదు చేశాడు. తొలుత అర్ధశతకం చేయడానికి 32 బంతులను తీసుకొన్న సూర్య.. ఆ తర్వాత సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. మరో 17 బంతుల్లోనే సెంచరీ మార్క్ను దాటేశాడు. కివిస్ బౌలర్లలో సౌథీ మూడు వికెట్లు తీయగా, ఫెర్గూసన్ రెండు, సోథి ఒక వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు