Chess: మాగ్నస్ కార్ల్సన్కు మరో పరాభవం.. ఈసారీ భారత గ్రాండ్మాస్టర్ చేతిలోనే..!
ప్రపంచ చదరంగంలో భారత యువ ఆటగాళ్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ నంబర్వన్ ర్యాంకర్ మాగ్నస్ కార్ల్సన్ (Magnus Carlsen)ను ఓడించాడో యువ గ్రాండ్ మాస్టర్. అయితే ఇది ఆన్లైన్ వేదికగా జరిగిన టోర్నీ కావడం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: చెస్ రారాజుగా పేరొందిన నంబర్వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ (Magnus Carlsen) ఇటీవల వరుసగా ఓటములను చవిచూస్తున్నాడు. భారతీయ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద చేతిలో ఇటీవల ఓడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో యువ గ్రాండ్ మాస్టర్ చేతిలోనూ కార్ల్సన్కు పరాభవం తప్పలేదు. ప్రో చెస్ లీగ్లో భాగంగా కెనడా చెస్ బ్రాహ్స్ ఆటగాడు, ప్రపంచ నంబర్వన్ ఆటగాడు కార్ల్సన్పై ఇండియన్ యోగిస్ ప్లేయర్, భారత గ్రాండ్ మాస్టర్ విదిత్ గుజ్రాతి (Vidit Gujrathi) విజయం సాధించాడు.
దాదాపు 16 జట్లు ఆన్లైన్ వేదికగా తలపడే ఈ టోర్నీ విజేతగా నిలిచిన టీమ్కు 1.50 లక్షల డాలర్ల ప్రైజ్మనీ అందనుంది. నల్లపావులతో ఆడిన విదిత్ ప్రత్యర్థి కార్ల్సన్ చేసిన పొరపాట్లను తనకు అనుకూలంగా మార్చుకొన్నాడు. దీంతో కార్ల్సన్పై విజయం సాధించాడు. ఈ సందర్భంగా విదిత్ మాట్లాడుతూ.. ‘‘ఇద్దరం చాలా తీవ్రంగా పోరాడాం. తప్పకుండా విజయం సాధిస్తాననే నమ్మకం నాకుంది. చివరికి గెలిచా’’ అని వ్యాఖ్యానించాడు. కార్ల్సన్పై విజయం సాధించిన తర్వాత ట్విటర్ వేదికగా కూడా విదిత్ స్పందించాడు. ‘‘ఇప్పుడే ఆల్టైమ్ గ్రేట్ దిగ్గజం ఆటగాడిని ఓడించా. అతడే ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్’’ అని ట్వీట్ చేశాడు. దీంతో గతంలో కార్ల్సన్పై విజయం సాధించిన ఆర్ ప్రజ్ఞానానంద , డి గుకేష్, అర్జున్ ఇరిగైసి సరసన విదిత్ చేరిపోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!