IND vs AUS: భారత విజయాలతో ఆసీస్‌ ఆటగాళ్ల అహం దెబ్బతింది

టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాలో వరుసగా రెండు టెస్టు సిరీస్‌లు గెలుపొందడం ద్వారా కంగారూ ఆటగాళ్ల అహం దెబ్బతినిందని, అలాగే జట్టులో తమ స్థానాలు కోల్పోతామనే భయం...

Published : 10 Jan 2022 01:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాలో వరుసగా రెండు టెస్టు సిరీస్‌లు గెలుపొందడం ద్వారా కంగారూ ఆటగాళ్ల అహం దెబ్బతిందని.. అలాగే జట్టులో తమ స్థానాలు కోల్పోతామనే భయం ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందిలోనూ కలిగిందని ఆ జట్టు మాజీ కోచ్‌ జాన్‌ బుచానన్‌ అన్నాడు. ఈ క్రమంలోనే వారు ఇప్పుడు బాగా ఆడాల్సిన సమయం వచ్చిందని తాజాగా ఓ అంతర్జాతీయ పత్రికతో చెప్పాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ ఆసీస్‌ విజేతగా నిలిచిందని, అందుకు ప్రస్తుత కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ విశేషంగా కృషి చేశాడన్నాడు.

‘లాంగర్‌ కష్ట సమయాల్లో ఆసీస్‌కు అండగా ఉన్నాడు. ఏ జట్టునైనా తిరిగి విజయపథంలో నడిపించడానికి సమయం పడుతుంది. ఇక గత నవంబర్‌లో ఆసీస్‌ ప్రపంచకప్‌ గెలిచాక అతడితో మాట్లాడాను. ఆ సమయంలో లాంగర్‌.. పొట్టి కప్ గెలవడం కన్నా.. ఆ మెగా ఈవెంట్‌కు జట్టును ఎలా తీర్చిదిద్దింది, ఎలాంటి ప్రణాళికలు రూపొందించాననే  విషయాలు చెప్పడానికి ఆసక్తి కనబరిచాడు. అతడికి మాజీ సారథి టిమ్‌పైన్‌ కూడా సహకరించాడు’ అని బుచానన్‌ తెలిపాడు. మరోవైపు ఆసీస్‌ ఇప్పుడు ఇంగ్లాండ్‌తో యాషెస్‌ సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు టెస్టులు గెలిచి సిరీస్‌ కైవసం చేసుకున్న ఆ జట్టు నాలుగో టెస్టును డ్రాగా ముగించింది. ఐదో టెస్టు మ్యాచ్‌ జనవరి 14 నుంచి ప్రారంభం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని