Dhoni: ధోనీ కొత్త లుక్ అదిరింది.. సోషల్మీడియాలో వైరల్!
ఆటలోనే కాదు.. తన ఆహార్యంలోనూ స్టైలిష్గా కనిపించే ధోని హెయిర్ స్టైల్ ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆటలోనే కాదు ఆహార్యంలోనూ స్టయిలిష్గా కనిపించే ధోనీ.. హెయిర్ స్టయిల్ పట్ల ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటాడు. కెరీర్ తొలినాళ్లలో జులుపాలతో ఉన్న ధోనీ ఆ తర్వాత స్టయిల్ మారుస్తూ వస్తున్నాడు. ఒక్కో స్టయిల్ అదిరిపోయేలా ఉండడంతో యువత సైతం ధోనీ స్టయిల్ అంటూ హెయిర్ సెలూన్లకు పరిగెత్తుతుంటారు. అయితే, అంతర్జాతీయ క్రికెట్కు ధోనీ గుడ్ బై చెప్పినా.. స్టయిల్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ఎప్పటికప్పుడు హెయిర్ స్టయిల్స్ మారుస్తూ ట్రెండ్ సెట్టర్గా మారుతున్నాడు.
ఇటీవల ‘ఫంకీ’ హెయిర్ స్టయిల్తో కుర్రకారును తెగ ఆకర్షించిన ధోనీ.. ఇప్పుడు మరో కొత్త లుక్లో రాయల్గా కనిపిస్తున్నాడు. ఐపీఎల్ అధికారిక ప్రసారకర్త అయిన స్టార్ స్పోర్ట్స్ ధోనీ న్యూ లుక్కు సంబంధించిన ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేస్తూ ‘‘ఐపీఎల్కు ముందు ధోనీ కొత్తదనాన్ని పొందాడు. అసలైన సినిమా ఇంకా మిగిలే ఉంది. వేచి ఉండండి’’ అనే వ్యాఖ్యను జతచేసింది. ఇందులో ‘మిస్టర్ కెప్టెన్ కూల్’ స్పాంకీ లుక్లో కనిపిస్తున్నాడు. ఈ ఫొటోను చూసిన అతని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇక బయోబుడగలో ఉన్న ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఐపీఎల్ 14 సీజన్ అర్ధంతరంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి మిగిలిన మ్యాచ్లు యూఏఈలో జరగనున్నాయి. ఇందు కోసం ఫ్రాంఛైజీలు ఇప్పటినుంచే బయోబుడగలు ఏర్పాటు చేస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని పలువురు ఆటగాళ్లు ఇప్పటికే యూఏఈకి చేరుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ! ప్లేఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. -
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. -
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు