FIFA Cup: ‘బంగారు ఐఫోన్లు’.. టీం సభ్యులకు మెస్సి గిఫ్ట్!
ఖతార్ ఫుట్బాల్ ప్రపంచ కప్ విజయానికి గుర్తుగా అర్జెంటీనా కెప్టెన్ మెస్సి(Messi) తన తోటి క్రీడాకారులు, సిబ్బందికి బంగారు ఐఫోన్లను గిఫ్ట్గా ఇచ్చాడు. గతేడాది జరిగిన ఈ పోటీలో ఫ్రాన్స్పై గెలుపొంది అర్జెంటీనా విశ్వ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సి(Messi) ‘ఫిఫా వరల్డ్ కప్’ గెలుపు సంబరం ఇంకా తీరలేదు! గతేడాది సాధించిన ఈ అపురూప విజయానికి గుర్తుగా తన అర్జెంటీనా(Argentina) జట్టు సభ్యులు, సిబ్బందికి మరపురాని లగ్జరీ గిఫ్ట్లు ఇచ్చాడు. అవే.. బంగారు ఐఫోన్(Gold iPhones)లు. రూ.1.72 కోట్లతో ప్రత్యేకంగా తయారు చేయించిన 35 ‘ఐఫోన్లను తోటి క్రీడాకారులకు, స్టాఫ్కు కానుకగా అందజేశాడు. గతేడాది డిసెంబరులో ఖతార్లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్(FIFA World Cup) ఫైనల్లో ఫ్రాన్స్పై అర్జెంటీనా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జట్టుకు మెస్సియే కెప్టెన్గా వ్యవహరించాడు.
తన తోటి ఆటగాళ్లు, సిబ్బంది ఈ అద్భుత విజయాన్ని ఎప్పటికీ సెలబ్రేట్ చేసుకునేలా వ్యక్తిగత బహుమతులు ఇవ్వాలని మెస్సి భావించాడు. ఈ క్రమంలోనే 24 క్యారెట్ బంగారు స్మార్ట్ఫోన్లను ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయమై ఐడిజైన్ గోల్డ్ సంస్థను సంప్రదించాడు. ప్రతి ఫోన్ వెనుక భాగంలో సంబంధిత క్రీడాకారుడు, సిబ్బంది పేరు, షర్ట్ నంబర్, అర్జెంటీనా టీం లోగో, ‘వరల్డ్ కప్ ఛాంపియన్స్ 2022’ అని వచ్చేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. ఇటీవలే ఈ ఫోన్లను డెలివరీ చేసినట్లు సదరు సంస్థ ధ్రువీకరించింది. సంబంధిత ఫోన్ ఫొటోలను పోస్ట్ చేసింది. ఇవి కాస్త నెట్టింట వైరల్గా మారాయి.
ఇదిలా ఉండగా.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో గెలిచింది. ఈ టోర్నీ విజయంతో అర్జెంటీనా స్టార్ ఆటగాడు మెస్సి కల నెరవేరింది. తన సారథ్యంలో అర్జెంటీనాకు కప్పు రావడం ఇదే తొలిసారి. గతంలో 1978, 1986లో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. తాజా గెలుపుతో దశాబ్దాల నిరీక్షణకు తెరపడినట్లయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు