PV Sindhu: స్విస్‌ ఓపెన్‌.. సెమీ ఫైనల్లోకి ప్రవేశించిన సింధు, ప్రణయ్‌

స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో భారత షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్‌ సెమీ ఫైనల్లోకి ప్రవేశించారు. వీరిద్దరూ వరుస సెట్లలో విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లడం విశేషం...

Published : 25 Mar 2022 22:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో భారత షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్‌ సెమీ ఫైనల్లోకి ప్రవేశించారు. వీరిద్దరూ వరుస సెట్లలో విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లడం విశేషం.

శుక్రవారం జరిగిన మ్యాచులో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు, కెనడా క్రీడాకారిణి ఐదో సీడ్ మిచెల్ లీపై పై చేయి సాధించింది. 36 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచులో 21-10, 21-19 తేడాతో సింధు ఆధిపత్యం చలాయించింది. శనివారం జరుగనున్న సెమీ ఫైనల్ మ్యాచులో సింధు.. థాయ్‌లాండ్‌కు చెందిన అన్‌సీడెడ్‌ క్రీడాకారిణి సుపనిదా కటెథాంగ్‌తో తలపడనుంది. 

మరో మ్యాచులో కామన్వెల్త్‌ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన పారుపల్లి కశ్యప్‌పై.. హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ గెలుపొందాడు. 43 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచులో ప్రణయ్‌ 21-16, 21-16 తేడాతో కశ్యప్‌ని ఓడించాడు. మరో క్వార్టర్ మ్యాచులో విజయం సాధించిన ఆటగాడితో ప్రణయ్‌ తలపడనున్నాడు. మరో భారత క్రీడాకారుడు సమీర్ వర్మ, ఇండోనేషియాకు చెందిన మూడో సీడ్ ఆంథోనీ సినిసుకాల క్వార్టర్ ఫైనల్ మ్యాచులో తలపడనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని