Ashwin: నేడు జట్టుతో కలవనున్న అశ్విన్..!
టీమ్ ఇండియాకు ఊరటనిచ్చే వార్తను బీసీసీఐ ప్రకటించింది.
ఇంటర్నెట్డెస్క్: వ్యక్తిగత అత్యవసర కారణాలతో రాజ్కోట్లో జరుగుతున్న మూడోటెస్ట్ మధ్యలో జట్టుకు దూరమైన టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ అశ్విన్ (Ravichandran Ashwin) విషయంలో కీలక అప్డేట్ వచ్చింది. ఆదివారం నుంచి అతడు అందుబాటులోకి వస్తున్నాడని బీసీసీఐ ప్రకటించింది. ‘‘కుటుంబంలో అత్యవసర పరిస్థితి కారణంగా మ్యాచ్లో విరామం తీసుకొన్న ఆర్.అశ్విన్ తిరిగి నేడు జట్టుతో కలవనున్న విషయాన్ని చెప్పేందుకు సంతోషిస్తున్నాం. మ్యాచ్ రెండో రోజు అత్యవసర పరిస్థితుల కారణంగా జట్టును వీడిన విషయం తెలిసిందే. అతడి కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని జట్టు యాజమాన్యం, ఆటగాళ్లు, మీడియా, అభిమానులు అండగా నిలిచారు. ఈ కష్ట సమయంలో సహచరులు సమష్టిగా మద్దతు ఇచ్చారు. అతడికి మేనేజ్మెంట్ మైదానంలోకి పునః స్వాగతం పలుకుతోంది’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.
టెస్టు క్రికెట్ చరిత్రలో 500 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్గా అరుదైన ఘనత సాధించిన రవిచంద్రన్ అశ్విన్ .. ఆ ఫీట్ అనంతరం కొన్ని గంటలకే జట్టు నుంచి దూరమయ్యాడు. కుటుంబంలో తలెత్తిన మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టు నుంచి అర్ధంతరంగా వైదొలిగాడు. దీంతో అతడి స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారన్న అంశంపై ఆసక్తికర చర్చ జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్