World Cup-Sachin: వన్డే ప్రపంచకప్.. సచిన్ తెందూల్కర్కు అరుదైన గౌరవం
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్కు అరుదైన గౌరవం దక్కింది. సచిన్ను వన్డే ప్రపంచకప్ గ్లోబల్ అంబాసిడర్గా ఐసీసీ నియమించింది.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar)కు అరుదైన గౌరవం దక్కింది. మరో రెండు రోజుల్లో భారత్ వేదికగా ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్నకు సచిన్ను గ్లోబల్ అంబాసిడర్గా ఐసీసీ నియమించింది. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య టోర్నీ ఆరంభ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు సచిన్ గ్లోబల్ అంబాసిడర్ హోదాలో ప్రపంచకప్ ట్రోఫీతో మైదానంలోకి వస్తాడు. దీంతో ఈ ప్రపంచకప్ టోర్నీ అధికారికంగా ప్రారంభమవుతుంది.
అదేవిధంగా ప్రపంచకప్ కోసం ఐసీసీ పలువురు మాజీ క్రికెటర్లను అంబాసిడర్లుగా ప్రకటించింది. ఈ జాబితాలో వెస్టిండీస్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్, ఇంగ్లాండ్కు ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా), శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్, రాస్ టేలర్ (న్యూజిలాండ్), భారత మాజీ ఆటగాడు సురేశ్ రైనా, మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, మహ్మద్ హఫీజ్ (పాకిస్థాన్) ఉన్నారు.
ఈ నాలుగు జట్లు సెమీస్ చేరతాయి: మైఖేల్ వాన్
ప్రస్తుతం క్రికెట్ ప్రేమికుల దృష్టి అంతా వన్డే ప్రపంచకప్పైనే ఉంది. హోరాహోరీగా సాగే ఈ టోర్నీలో టైటిల్ను ఏ జట్టు దక్కించుకుంటుంది? ఏఏ జట్లు బలంగా ఉన్నాయి, ఏవి సెమీస్కు చేరతాయనే గురించే చర్చించుకుంటున్నారు. అభిమానులే కాదు మాజీ క్రికెటర్లు సైతం ప్రపంచకప్ ఎప్పుడెప్పుడూ ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఏఏ జట్లు సెమీస్ చేరతాయనే దానిపై తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ (Michael Vaughan) తాజాగా తన అంచనాలను వెలువరించాడు. ఈ జాబితాలో బలమైన ఆస్ట్రేలియా జట్టుతోపాటు గతేడాది రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్కు చోటు దక్కకపోవడం గమనార్హం. ‘‘ఈ వారం ప్రపంచ కప్ ప్రారంభమయ్యే వరకు వేచి ఉండలేను. నా అంచనా ప్రకారం ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, భారత్, పాకిస్థాన్ సెమీస్కు చేరతాయి’’ అని మైఖేల్వాన్ ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశాడు.
ఇదిలా ఉండగా.. భారత జట్టుపై మైఖేల్ వాన్ (Michael Vaughan) ఇటీవల ప్రశంసలు కురిపించాడు. వన్డే ప్రపంచకప్లో భారత్ను ఓడించిన జట్టు ప్రపంచకప్ను సాధిస్తుందని మైఖేల్వాన్ అభిప్రాయపడ్డాడు. ‘స్వదేశీ పిచ్లపై భారత బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. వారి బౌలింగ్ ఆప్షన్లు అన్ని కవర్ అయ్యాయి. ఇక ఒత్తిడి మాత్రమే వారిని ఆపగలదు’’ అని పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇన్నింగ్స్ ఇంకా ఉంది
సందిగ్ధత తొలగింది. ఊహాగానాలకు తెరపడింది. టీమ్ఇండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నాడు. అతడి కాంట్రాక్ట్ను పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. వీవీఎస్ లక్ష్మణ్ ఎన్సీఏలోనే ఉంటాడు. -
మెప్పించాడు ఇలా...
జూనియర్ కోచ్గా, ఎన్సీఏ అధిపతిగా తనదైన ముద్ర వేసినా, మంచి పేరు తెచ్చుకున్నా ద్రవిడ్ ఏనాడు టీమ్ఇండియా కోచ్ పదవిపై ఆసక్తిని ప్రదర్శించలేదు. బీసీసీఐ పెద్దలు ప్రయత్నించినా ఎందుకో అతడు విముఖత వ్యక్తం చేశాడు. కానీ ద్రవిడ్ ఒకప్పటి సహచరుడైన గంగూలీ (అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు).. రవిశాస్త్రి అనంతరం కోచ్గా ఉండేలా ద్రవిడ్ను ఒప్పించగలిగాడు. -
మరి రోహిత్?
దక్షిణాఫ్రికా పర్యటన కోసం సెలక్షన్ కమిటీ గురువారం భారత జట్లను ప్రకటించనుంది. టీ20ల్లో తిరిగి భారత్కు నాయకత్వం వహించాలని రోహిత్ శర్మను బీసీసీఐ పెద్దలు ఒప్పించడానికి ప్రయత్నించే అవకాశముంది. 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఓడినప్పటి నుంచి రోహిత్ పొట్టి క్రికెట్కు దూరంగా ఉన్నాడు. -
ఇలాంటి పరిస్థితుల్లో ఎంతైనా ఛేదించొచ్చు
ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత పేసర్ల వైఫల్యానికి విపరీతమైన మంచు కారణమని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవర్కు 14 పరుగుల లక్ష్య ఛేదన కూడా సాధ్యమేనని తెలిపాడు. 222 స్కోరును కాపాడుకోలేకపోయిన భారత్.. చివరి 5 ఓవర్లలో 80 పరుగులు సమర్పించుకుంది. -
ఆ అనుభవం ఉపయోగపడుతుంది
గొప్ప సారథుల ఆధ్వర్యంలో ఆడిన అనుభవం తనకెంతో ఉపయోగపడుతుందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్శర్మ సారథ్యంలో ఆడిన గిల్.. ఐపీఎల్లో తొలిసారిగా నాయకత్వం వహించనున్నాడు. -
వచ్చే ఏడాది శ్రీలంకకు టీమ్ఇండియా
సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ)కు శుభవార్త. వచ్చే ఏడాది జులై- ఆగస్టులో శ్రీలంకలో భారత జట్టు పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడేసి వన్డేలు.. టీ20ల్లో భారత్, శ్రీలంక తలపడతాయని 2024 వార్షిక క్యాలెండర్లో ఎస్ఎల్సీ పేర్కొంది. వచ్చే ఏడాది శ్రీలంక 52 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది. -
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
ముంబయి ఇండియన్స్ (MI) జట్టులో ఏం జరుగుతుందనేది అభిమానుల్లో ఉత్కంఠగా మారింది. బుమ్రా పెట్టిన పోస్టుపై జట్టునే ఒక కుటుంబంగా భావించే మేనేజ్మెంట్ ఎలా స్పందిస్తుందో అందరిలోనూ మెదిలే ప్రశ్న. -
విలియమ్సన్ సెంచరీ
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. ఆతిథ్య బంగ్లాదేశ్ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన కివీస్కు.. బ్యాటుతో ఇబ్బందులు తప్పలేదు. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (4/89) సత్తా చాటడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 8 వికెట్లకు 266 పరుగులు సాధించింది.


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 20,120
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
AP Liquor: బ్రాండ్ విచిత్రం.. పురుగు ఉచితం!
-
Kidnap: 25 మంది భద్రాద్రి జిల్లా వ్యాపారుల కిడ్నాప్
-
YS Jagan: సీఎం క్యాంపు కార్యాలయంపై పాలకులకైనా స్పష్టత ఉందా?
-
Andhrapradesh news: సీఎం నిర్ణయాలా కాకమ్మ కబుర్లా?